కడప: టిడిపి, వైసిపి నేతల మద్య సవాల్, ప్రతి సవాళ్ల నేపథ్యంలో కడపలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి నేతలు శ్రీనివాసులు రెడ్డి, హరిప్రసాద్ లను పోలీసులు హౌజ్ అరెస్టు చేసారు. వైసిపి నేతల సవాళ్లు విసరడంతోనే బహిరంగ చర్చకు సిద్దమయ్యమని టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసుల రెడ్డి అన్నారు.
సెవెన్ రోడ్స్ లో బహిరంగ చర్చకు అనుమతించక పోతే.. మా ఇంటి దగ్గర కే వైసిపి నేతలను రమ్మనండి. మేము శాంతి భద్రతల సమస్య తీసుకు రావడం లేదు.. శాంతియుతంగా కడప నగర అభివృద్ధి పై చర్చిస్తామని అన్నారు..