A place where you need to follow for what happening in world cup

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టులో విచారణ

0

హైదరాబాద్: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పిటిషన్ ఫై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. మాస్టర్ ప్లాన్ మున్సిపల్ కౌన్సిల్ విత్ డ్రా చేసుకుందని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టు కు తెలిపారు. అయితే,  ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోర్టు కు తెలిపారు. టౌన్ ప్లానింగ్ యాక్ట్  సెక్షన్14 ప్రకారం ప్రభుత్వానికి అధికారులు ఉన్నాయి.

మాస్టర్ ప్లాన్ పరిగణలోకి తీసుకోవాలా లేదా అనేది ప్రభుత్వ నిర్ణయం. ప్రభుత్వం ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అన్నారు.  మున్సిపల్ కౌన్సిల్ నిర్ణయం ఫై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు ప్రశ్నించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలనీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ను ఫిబ్రవరి 22 కు వాయిదా వేసింది.

Leave A Reply

Your email address will not be published.