A place where you need to follow for what happening in world cup

డ్వాక్రా మహిళలకు అండగా రిలే నిరాహార దీక్ష చేపట్టిన జనసేన

0

పల్నాడు
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం లో డ్వాక్రా మహిళలకు అండగా వైయస్సార్ క్రాంతి పదం (డ్వాక్రా ) కార్యాలయం ఎదుట దాచేపల్లి మండల జనసేన నాయకులు మరియు కార్యకర్తలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. లంచాలు తీసుకున్న ఏపీఎం ని వెంటనే సస్పెండ్ చేసి విచారణ చెయ్యాలంటూ రిలే నిరాహార దీక్షకు దిగారు. డ్వాక్రా మహిళలు తో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు.

ముడుపులు తీసుకుని డ్వాక్రా సంఘాలను చిన్నాభిన్నం చేస్తున్న దాచేపల్లి డిఆర్డిఏ ఏపీఎం. 20,000 ముడుపులు తీసుకుని గామాలపాడు స్రవంతి గ్రూపు లో సభ్యుల మార్పు చేర్పులు చేస్తున్నారు. పాత సభ్యుల సీనియారిటీని  కొత్తగా చేరిన సభ్యులకు కట్టబెట్టి ఒకేసారిగా ఎనిమిది లక్షల రూపాయల రుణం ఇప్పించేలా ఒప్పందం. స్వయం సహాయక సంఘాలను విచ్ఛిన్నం చేస్తున్న అధికారులపై వెంటనే చర్యలే తీసుకోవాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.