మహాసభ లోగో విడుదల చేసిన నాయుకులు
కడప:రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఎనిమిదవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని రాజంపేట పట్టణంలోలోని శ్రీ విద్యానికేతన్ పాఠశాలలో మహాసభల లోగోను ఆ పాఠశాల కరస్పాండెంట్ ప్రభాకర్ నాయుడు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభాకర్ నాయుడు మాట్లాడుతూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ గత ఎనిమిది సంవత్సరాల నుంచి అనేక ఉద్యమాలు నిత్యం విద్యార్థుల సమస్యలపై పోరాటాలు చేస్తున్నా రని తెలిపారు.అనంతరం రాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా. పోలవరం నిర్మాణం. కడప ఉక్కు పరిశ్రమ. విశాఖ రైల్వే జోన్. దుగ్గరాజపట్నం పోర్ట్.
కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్. వైజాగ్-చెన్నై పారిశ్రామిక కారిడాల్. నిధుల లోటు భర్తీ. వెనుకబడిన జిల్లాలకు. ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ కోసం రెవల్షనరీ విద్యార్థి సంఘం అనేక పోరాటాలు చేస్తూనే ఉంది.ఈ నేపథ్యంలో రెవల్యూషనరీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఎనిమిదవ మహాసభలు ఈనెల 26, 27, 28 తేదీలలో మూడు రోజులపాటు ఒంగోలు పట్టణంలోని సిపిఐ భవన్ లో జరుగుతున్నాయి.కావున విద్యార్థిని విద్యార్థులు మరియు నిరుద్యోగులు యువత ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ యు నాయకులు అల్లి . సుకుమార్. కిరణ్ పాల్గొన్నారు.