గుంటూరు: సరుకు లేని లోకేష్ పాదయాత్ర చేసి ఏం ప్రయోజనం? అది యువ గళమో.. గరళమో త్వరలోనే తెలుస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గొడ్డొచ్చిన వేళ, బిడ్డ వచ్చిన వేళ.. అన్నట్టు లోకేష్ రాకతో టీడీపీ పతనం! బాబు కొడుకుగా తప్పితే లోకేష్ కు ఏ అర్హత ఉందరి అయన ప్రశ్నించారు. దుకంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? ఒళ్లంతా పుండవుతుంది. అదే లోకేష్కు కూడా జరుగుతుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు లోకేష్ ఒక బఫూన్, ఒక జోకర్. ఆయనకు పర్సనాలిటీ, క్యారెక్టర్ రెండూ లేవు. అయినా ఆయనను రాష్ట్రం విూద రుద్దాలని లోకేష్ తల్లిదండ్రులు తాపత్రయ పడుతున్నారు. అందుకే లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా, ఆయన నాయకుడు కాలేడు. ఎందుకంటే ఆయన దగ్గర సరుకు లేదు. నాయకుడు అనే వాడికి కొన్ని లక్షణాలు ఉండాలి. పట్టుదల, చిత్తశుద్ధి ఉండాలి. అవేవీ లోకేష్కు లేవు. ` తన తండ్రి సీఎంగా పనిచేశారు కాబట్టి, తానూ సీఎం కావాలనుకుంటే ఎలా అని అడిగారు.
ఇద్దరూ బఫూన్ లే
రాష్ట్రంలో ఇద్దరు బఫూన్లు తయారయ్యారు. ఒకరు చంద్రబాబు పుత్రుడు, మరొకరు చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్. ఒకాయన పాదయాత్రతో వచ్చినా.. మరొకరు వారాహి విూద వచ్చినా అంతా హాస్యమే. పవన్ నోటికి అడ్డూ అదుపు లేదు. ఆఖరికి తన తండ్రి గురించి ఏదేదో మాట్లాడతాడు. ఇక లోకేష్ తన తండ్రి కంటే గొప్పవాడినని చెప్పుకుంటున్నాడు. ఇద్దరి మాటలు అచ్చం జోకర్ల మాదిరిగా ఉన్నాయి. లోకేష్ ప్రత్యక్షంగా ఏ ఎన్నికలోనూ గెలవలేదు. కేవలం చంద్రబాబు కొడుకుగా ఎమ్మెల్సీ అయి, దొడ్డి దారిలో మంత్రి అయ్యాడు. కేవలం చంద్రబాబు తనయుడుగా తప్ప, లోకేష్ కు ఒక్కటైనా అర్హత ఉందా?. నిన్న ఉపన్యాసంలో లోకేష్ మాట్లాడినవన్నీ అసత్యాలే. పాదయాత్ర చేస్తున్న లోకేష్ కు చిత్తశుద్ధి లేదు. తానేదో పెరగాలనే తాపత్రయంతో ఆయన పాదయాత్ర చేపట్టాడు.
పాదయాత్రలు కొత్త కాదు. ఆనాడు మహానేత వైయస్సార్ గారు సుదీర్ఘ పాదయాత్ర చేసి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత చాలా మంది పాదయాత్రలు చేశారు. నేను ఒకటి అడుగుతున్నాను. విూ సీఎం అభ్యర్థి ఎవరు? నీవా? లేక నీ తండ్రినా? లేక పవన్కళ్యాణ్నా?. చిరంజీవి, నాగబాబులు సమాధానం చెప్పాలి పవన్ తన పర్యటనల కోసం కొన్న వారాహి వాహనం గురించి కూడా లోకేష్ మాట్లాడాడు. అంటే ఇప్పటికే ప్యాకేజీ కుదిరిందా?. ఇక పవన్ కూడా దారుణంగా మాట్లాడుతున్నాడు. తన నానమ్మ దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే, దాంతో తన తండ్రి సిగరెట్ వెలిగించుకున్న హేతువాది అన్నాడు. ఆ విధంగా ఆయన తన తండ్రిని అవమానించాడు. అది నిజమో, అబద్ధమో చిరంజీవి లేదా నాగబాబు చెప్పాలి. ఏమిటా దుర్మార్గమైన మాటలు. హేతువాదులైనంత మాత్రాన, మరొకరి విశ్వాసాలను, నమ్మకాలను దెబ్బతీసే హక్కు పవన్ కల్యాణ్ కు ఎక్కడిదని నిలదీసారు.భాష విూద పట్టు లేని వారు, చిత్తశుద్ధి లేని వారు, ఏం మాట్లాడుతున్నారో తెలియని వారు వీరు.
టీడీపీకి సంస్కారం లేదు.. విూరే భోజనం ఏర్పాట్లు చేసుకోండి పోలీసులకు అంబటి సూచన నిన్న కుప్పం సభలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పోలీసులను ఉద్దేశించి చాలా దారుణంగా బూతులు మాట్లాడాడు. అది వారి పతనానికి నాంది. ఆశించిన స్థాయిలో ప్రజా సవిూకరణ, ప్రజల్లో స్పందన లేకపోవడంతో తెలుగుదేశం నేతల్లో ఫ్రస్టేషన్ మొదలైంది. మరోవైపు అందరూ ఏకమై జగ రిని ఓడిస్తామని అంటున్నారు. అవన్నీ పిచ్చి మాటలు. యువగళం పేరుతో వస్తున్న లోకేష్కు జనం తగిన బుద్ధి చెబుతారు. తమ భద్రత కోసం పని చేస్తున్న పోలీసుల గురించి టీడీపీ నేతలు అలా మాట్లాడడం దారుణం. వారు తిండి కోసం రారు. ఈ విషయాన్ని గుర్తించాలి. సిన్సియర్గా పని చేసే పోలీసులకు నాదొక విజ్ఞప్తి. యువగళం యాత్రలో డ్యూటీ చేస్తున్న పోలీసులు.. భోజన ఏర్పాట్లు సొంతంగా ఏర్పాటు చేసుకొండి. ఎందుకంటే టీడీపీ నేతలు, అచ్చెన్నాయుడుకు ఏ మాత్రం సంస్కారం లేదని అన్నారు.