Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు. కేటీఆర్ ప్రసంగానికి, ఏపీ సీఎం జగన్‌కు సంబంధం ఏమిటి?..

0

తెలంగాణలో అమ‌ర‌రాజా కంపెనీ ఏకంగా రూ. 9,500 కోట్ల పెట్టుబ‌డి పెట్టడం… దాదాపు 10 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కల్పించే ‘అమరరాజా గిగా కారిడార్’కు శంకుస్థాపన జరగడం… దానికి మంత్రుల స్థాయి వ్యక్తులు హాజరయ్యి మాట్లాడడం.. ఇవేమీ సంచలనాత్మక విషయాలు కాకపోవచ్చు, చర్చనీయాంశమూ కాకపోవచ్చు. కానీ అమరరాజా కంపెనీ ఆంధ్రప్రదేశ్ నుంచి తరలివచ్చి తెలంగాణలో శంకుస్థాపన చేసుకోవడమే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారాయి.

 

ముఖ్యంగా ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏపీ ప్రజల్లో జరుగుతున్న ఆ చర్చ ఏమిటి?. కేటీఆర్ ప్రసంగానికి, ఏపీ సీఎం జగన్‌కు సంబంధం ఏమిటి?..
మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ‘అమరరాజా గిగా కారిడార్’ శంకుస్థాపన కార్యక్రమం సందడిగా జరిగింది. గల్లా జయదేవ్, రామచంద్ర నాయడు, అరుణతోపాటు తెలంగాణ మంత్రులు కేటీఆర్ , శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. మహబూబ్‌నగర్‌కు సమీపంలో దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో ఈ లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీ ఏర్పాటు చేస్తుండడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కంపెనీ ద్వారా రూ.9,500 కోట్ల భారీ మొత్తంలో పెట్టబడి రానుంది.

 

ఒకప్పుడు వలసలకు కేంద్రంగా ఉన్న ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీతో దశ మారనుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే అభిప్రాయాన్ని మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. ‘‘ ఒక ప‌రిశ్ర‌మ రావాలంటే దాని వెనుకాల త‌దేక‌మైన దీక్ష‌తో, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే వ‌స్తాయి. ఇది పోటీ ప్ర‌పంచం. పోటీ ప్ర‌పంచంలో అవినీతి ర‌హిత పార‌ద‌ర్శ‌క‌మైన పాల‌న‌తో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఎక్క‌డైనా అమ‌ర‌రాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవ‌చ్చు. దివిటిప‌ల్లిలో ప్లాంట్ పెడుతామ‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి త‌మ త‌మ రాష్ట్రాల‌కు రావాల‌ని ఆహ్వానించారు.

 

కానీ అమ‌ర‌రాజా గ్రూప్ వారు ఇక్క‌డే ప్లాంట్ ప్రారంభించేందుకు స‌ముఖ‌త వ్య‌క్తం చేశారు. దీక్ష‌తో, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే పెట్టుబ‌డులు వ‌స్తాయి’’ అని వ్యాఖ్యానించారు. కాబ‌ట్టి అంద‌రికీ ఉద్యోగాలు క‌ల్పించాలంటే.. ప్ర‌యివేటు రంగంలో పెట్టుబ‌డుల‌ను ఆహ్వానించాలి. ప‌రిశ్ర‌మ‌ల‌కు ఊత‌మిస్తేనే కొలువులు వ‌స్తాయి. రాష్ట్రానికి సంప‌ద వ‌స్తుంది. ఈ సంప‌ద‌తో పేద‌ల కోసం సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు చేసేందుకు ఉప‌యోగ‌ప‌డుతంది’’ అని కేటీఆర్ అన్నారు. కేటీఆర్ మాట్లాడిన ఈ మాటలే ఏపీలో ఇప్పుడు చర్ఛనీయాంశమయ్యాయి. దీనికి కారణంగా ఏపీ నుంచి తరలివెళ్లిన అమరరాజా కంపెనీ తెలంగాణలో తమ కంపెనీని ఏర్పాటు చేయడమే కారణంగా ఉంది. భారీ పెట్టుబడి పెట్టే కంపెనీని తెలంగాణకు అప్పగించారని సీఎం జగన్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

 

అమరరాజా గిగా కారిడార్ ఏర్పాటు సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఏపీలో సీఎం జగన్ సర్కారుపై జనం విమర్శల దాడి చేస్తున్నారు. అమరరాజా నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కళ్లకు అద్దుకుని సాదరంగా స్వాగతిస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం రాష్ట్రం నుంచి పరిశ్రమను తరిమికొట్టిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టే కంపెనీని కోల్పోయారని, ఇలాంటి కంపెనీలను తీసుకురావడం అంత సులభమా అని ప్రశ్నిస్తున్నారు. 10 వేల మందికి ఉద్యోగాలిచ్చే సంస్థను పనిగట్టుకొని వెళ్లగొట్టారని నిలదీస్తున్నారు.

 

ముఖ్యంగా పక్క రాష్ట్రం తెలంగాణ పెట్టుబడుల విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని ఏపీతో పోల్చి విమర్శలు గుప్పిస్తున్నారు. దీక్ష‌తో, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే పెట్టుబ‌డులు వ‌స్తాయన్న కేటీఆర్ మాటలను హితబోధగా భావించాలని అంటున్నారు. ఒక ప‌రిశ్ర‌మ రావాలంటే దాని వెనుకాల త‌దేక‌మైన దీక్ష‌, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తేనే వ‌స్తాయనే విధానంతో తెలంగాణ పనిచేస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం కాల్యుష్యం పేరిట పరిశ్రమ తరలిపోయేలా ప్రవర్తించిందని మండిపడుతున్నారు. పనిగట్టుకొని కంపెనీని వెల్లగొట్టారని అంటున్నారు.

 

రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బ తీస్తున్నారా అని వైసీపీ సర్కారును ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 8 రాష్ట్రాలు అమరరాజా కంపెనీని తమ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని కోరాయంటే ఆ కంపెనీ ఎంతటి విలువైనతో అర్థం చేసుకోవాలని హితబోధ చేస్తున్నారు. రాష్ట్ర యువత ప్రయోజనాల కోసమైనా ఆలోచిస్తే బావుండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడుల కోస చిత్తశుద్ధితో పనిచేయాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వస్తున్నాయి. మరి పక్క రాష్ట్ర మంత్రి వ్యాఖ్యల నుంచైనా పెట్టుబడుల విషయంలో ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుంటుందా? ఇకముందు కూడా ఇలాగే వ్యవహరిస్తుందా?.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ సర్కారు వైఖరి ఎలా ఉండబోతోందనేది భవిష్యత్‌లోనే తేలనుంది.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie