నేషనల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (ఐ) జాతీయ కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా సీనియర్ పాత్రికేయుడు పురుషోత్తం నారగౌని నియమితులయ్యారు. ఇటీవల ఒడిస్సా రాష్ట్రంలోని జజ్పూర్ కేంద్రంగా నిర్వహించబడిన యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఈ నియామకం జరిగింది. దక్షిణ భారతదేశంలోని తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ తమిళనాడు కర్ణాటక కేరళ రాష్ట్రాల యూనియన్ కార్యక్రమాల పర్యవేక్షణ తదితర బాధ్యతలు నిర్వహిస్తారు.
దారుణమైన మనస్తత్వం ఉన్న రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం సీఎం జగన్
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, జాప్ ఉపాధ్యక్షుడిగా, జాప్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా, తెలంగాణ జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా గతంలో ఈయన పని చేశారు. అలాగే ఎన్. యు . జే (ఐ ) జాతీయ కార్యవర్గ సభ్యులుగా సీనియర్ పాత్రికేయులు సిల్వేరి శ్రీశైలం, బుచ్చి రాములు, రాజన్న నియమితులయ్యారు. దక్షిణ భారతదేశంలో ఎన్ యు జె (ఐ) నీ బలోపేతం చేస్తానని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జర్నలిస్టులకు రావలసిన అన్ని వసతులను సౌకర్యాలను అందేలా తగు ప్రణాళికలు రూపొందించి ఉద్యమ నిర్మాణం చేస్తానని పురుషోత్తం నారగౌని అన్నారు.