–ఆహ్లదం పంచేలా అభివృద్ది పనులు
-జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్
మంథని:మంథని సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించి మంథని వాసులకు ఆహ్లదకరమైన వాతావరణం కల్పించేలా అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు. మంగళవారం మంథని పట్టణంలోని తమ్మిచెరువు,రావుల చెరువు, బొక్కలవాగుపై జరుగుతున్న రహదారి పనులను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్, మంథని మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ లు పర్యవేక్షించారు. ఈ సందర్బంగా జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు మాట్లాడుతూ మంథనికి చెందిన ఎంతోమంది ఇతర ప్రాంతాల్లో జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారు ఇక్కడి వస్తే నగర వాతావరణం కన్పించేలా పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయనతెలిపారు. మంథనిలోని అనేక ప్రాంతాలను సుందరీకరించి ఆహ్లదం పంచేలా అభివృద్ది చేస్తామన్నారు.
ఇందులో బాగంగా ఆయా చెరువు కట్టలపై వాకింగ్ ట్రాక్లు, సీసీ రోడ్లు, ఇతరత్రా సుందరీకరణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే మంథనిని అన్ని విధాలుగా అభివృద్ది చేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ది చేసి చూపిస్తామని ఆయన చెప్పారు. రావులచెరువు కట్టపై హనుమాన్టెంపుల్ వరకు సీసీ రోడ్డు, టెంపున్నుంచి శివకిరణ్ గార్డెన్ వరకు వాకింగ్ ట్రాక్, శివకిరణ్ గార్డెన్ నుంచి గురుకుల పాఠశాల వరకు వాకింగ్ ట్రాక్, తమ్మిచెరువు కట్టపై వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
మంథనిని పూర్తిస్థాయిలో అభివృద్దిపథంలోకి తీసుకెళ్లి ఆహ్లదం పంచేలా సుందరీకరణ చేయడమే తమ ఆకాంక్ష, ఆలోచన అని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మంథని బొక్కలవాగుపై ఏకో పార్క్ వరకు నూతనంగా చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వికే రవి, కాయితి సమ్మయ్య, గర్రెపల్లి సత్యనారాయణ, కుర్ర లింగయ్య, నాయకులు నక్క శంకర్, కొట్టే రమేష్, సముద్రాల శ్రీనివాస్, గుండ పాపారావు, వేముల సమ్మయ్య, కొత్త బాలయ్య లతో పాటు తదితరులు పాల్గొన్నారు.