Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

శ్రీ భక్త మార్కండేయ దేవాలయాన్ని సందర్శించిన శ్రీహరి మౌన స్వామి

0

సుమారు 40 ఏండ్ల క్రితం నిర్మించిన:జగిత్యాల,
జగిత్యాల జిల్లా బుగ్గారం లోని  శ్రీ భక్త మార్కండేయ దేవాలయాన్ని గీతా ధర్మ ప్రచార కేంద్రం – రోటిగూడ నిర్వాహకులు శ్రీహరి మౌన స్వామి సందర్శించారు. ఆలయ పరిసరాలను ఆయన స్వయంగా పరిశీలించి ఆలయ అభివృద్ధి కోసం మౌన స్వామి పలు సూచనలు అందజేశారు. 40 ఏండ్ల క్రితం బుదారపు లింగయ్య (స్వర్గస్తులయ్యారు) చే నిర్మించబడిన ఈ ఆలయానికి కమిటి చైర్మన్ గా ఆయన మనుమడు అయిన బుదారపు పరమేశ్వర్ కొనసాగుతున్నారు.

గత కొన్ని ఏండ్లుగా మార్కండేయ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమంలో శ్రీ సాంబశివ నాగేశ్వరాలయ కమిటీ చైర్మన్ మసర్ధి రాజిరెడ్డి, విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి, కటుకూరి అంజయ్య, పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు బాలపెళ్లి లక్ష్మణ్, బుదారపు చంద్రయ్య, చెట్ పల్లి బక్కన్న, రెబ్బ నాగరాజు, ప్రభు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie