సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 68వ రోజు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా, జడ్చర్ల నియోజకవర్గం లో కొనసాగింది. వడదెబ్బ వల్ల స్వల్ప అస్వస్థత గురైన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఐదు రోజుల విరామం తర్వాత మంగళవారం జడ్చర్ల నియోజకవర్గం, నవాబ్ పేట మండలం, రుక్కంపల్లి గ్రామం నుంచి తిరిగి తన పాదయాత్రను ప్రారంభించారు. రుక్కంపల్లి గ్రామం నుంచి మంగళవారం ఉదయం 7:30 గంటలకు సిఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభం అయింది. రుక్కంపల్లి, చెన్రెడ్డిపల్లి, ఇప్పటూరు, మల్రెడ్డిపల్లి, కూచూరు, దొడ్డిపల్లి, కిష్టారం గ్రామాల్లో కొనసాగింది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ మల్రెడ్డిపల్లి గ్రామంలో, రాత్రికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర బృందం కిష్టారం గ్రామాంలో బస ఏర్పాటు చేసారు. చేస్తారు