A place where you need to follow for what happening in world cup

HOT NEWS

మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలి

0

జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
పెద్దపల్లి:మహనీయుల ఆశయాలను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ తెలిపారు.గురువారం భగీరథ  జయంతి సందర్భంగా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో  అదనపు కలెక్టర్ లు లక్ష్మీనారాయణ, కుమార్ దీపక్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి భగీరథ చిత్రపటానికి పూల మాల వేసి  నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని తెలిపారు.  భగీరథుడు మహాజ్ఞాని పరోపకారానికి పెట్టిన పేరుని దీక్షకు తత్వానికి ప్రతిరూపం అని అన్నారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా లెక్కచేయకుండా అనుకున్న సాధించే వారిని భగీరథనీతో పోలుస్తారని, కఠోర పరిశ్రమ చేసి అసాధ్యమైన దాన్ని సాధించే వారిని భగీరథ ప్రయత్నం అని అంటారు అని తెలిపారు.

పురాణాల ప్రకారం దివి నుండి భువికి గంగను ఎంతో కష్టపడి భగీరథుడు తీసుకొచ్చాడు అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం భగీరథుని స్ఫూర్తితో ఇంటింటికి తాగునీరు అందించే దిశగా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి విజయవం తంగా పూర్తి చేసిందని, అదే సమయంలో సాగునీ టి రంగంలో సైతం భగీరథ ప్రయత్నం గా భారీ ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేసిందని తెలిపారు.  యువకులు సైతం భగీరధుని ఆదర్శంగా తీసుకొని జీవితంలో కష్టాలను ఎదుర్కొంటూ అనుకున్న లక్ష్యసాధన దిశగా పని చేయాలని  కలెక్టర్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో  జిల్లా  వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రంగారెడ్డి , జిల్లా అధికారులు, బిసి సంఘాలు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సంబంధిత అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.