కడప:ఇటీవల జరిగిన అందురాలు రాణి హత్య చేసిన రాజు పై కఠిన చర్యలు తీసుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి, ప్రజా సంఘాల నాయకుల ఆధ్వర్యంలో కడప అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ తాడేపల్లి లోని అంధురాలైన రాణి అనే యువతి మీద రాజు అనే కిరాతకుడు హత్యాచారం చేసి దారుణంగా చంపబడమైనది. ఈ హత్య ను వికలాంగుల హక్కుల పోరాట సమితి ఖండిస్తూ రాజు అనే వానిని వెంటనే ఉరితీయాలని అందురాలైన రాణి కి ఆమె కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మానసిక వికలాంగుల పైన మహిళల పైన దాడులు అత్యాచారం చేసి చంపడం చాలా దారుణం అన్నారు. మొన్న ఒంగోలు నిన్న కడప భాకరాపేట ఇప్పుడు సీఎం ఇంటి సమీపాన తాడేపల్లి లో రాణి అనే అందురాలైన మహిళ పైన అత్యాచారాలు హత్యలు జరిగినవి అలాగే రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము.
ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్, సంఘ సేవకులు సల్లావుద్దీన్, ఆర్ సి పి రవి శంకర్ రెడ్డి, ఎం ఎస్ పి నాయకులు మాతయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విభిన్న ప్రతిభావంతుల తెలుగుదేశం పార్టీ వికలాంగుల రాష్ట్ర అధికార ప్రతినిధి దాది శ్రీను, నగర అధ్యక్షుడు ప్రసాద్, విద్యార్థి రాష్ట్ర నాయకులు వర్ధన్, సుబ్బరాయుడు, ఎం ఆర్ పిఎస్ నాయకులు గంగులయ్య, ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రెడ్డి, వికలాంగులు జిల్లా కార్యదర్శి అంజి ,బి ఓబయ్య, ఆరిపుల్ల, చెయ్య రాజు తదితరులు వికలాంగుల పాల్గొన్నారు.