మురుగునీరు వెళ్లే ప్రధాన టూమును పూడ్చివేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమస్తను ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో వారు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం లోని సుగాలి కాలనీలో మురుగునీరు వెళ్ళిందుకు ఎనిమిది సంవత్సరాల క్రితం ఒక టూమును ఏర్పాటు చేశారు. దీనితో సుమారు 50 కుటుంబాల వారికి దీర్ఘకాలక సమస్య పరిష్కారమైంది.
అయితే అనుకోని విధంగా ఇటీవల స్థానిక జడ్పిటిసి తిరుపతిరావు అతని సోదరుడు ఆ తూమును పూడ్చివేశారు. దీంతో ఆ కుటుంబాలు వాడే మురుగునీరు రోడ్డుమీదికి వస్తోంది. రాబోయేది వర్షాకాలం కావడంతో సమస్య మరింత జతిలంగా మారే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులే ఇటువంటి ఘాటుకానికి పాల్పడడం బాధాకరమని స్థానికులు పేర్కొంటున్నారు.