-
- పెన్షనర్ల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
- పెన్షనర్ల సంఘ అద్యక్షులు గంగరాజం
- జగిత్యాల, ఫిబ్రవరి 09
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి వెంటనే చొరవ చూపాలని, పీఆర్సీ కోసం ఒక కమిటీని నియమించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు ఎల్లా గంగరాజం కోరారు. గురువారం స్థానిక పెన్షనర్ల సంఘ భవన్ లో కార్యనిర్వాహక వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన గంగరాజం ఆధ్వర్యంలో సభ్యులు చర్చించి 6 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా గంగరాజం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల హెల్త్ స్కీమ్ పై ఇటీవల ప్రయత్నాలు ప్రశంసించదగినవన్నారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు రెండు కరువు భత్యాలు రావాల్సి ఉందన్నారు.
ప్రతినెలా ఒకటవ తేదీన పెన్షన్ వేయాలని, కమ్యూనిటీ పెన్షన్15 ఏండ్ల నుంచి 12 ఏండ్లకు తగ్గించి వర్తింపజేయాలని కోరారు. 398 వేతనంతో పనిచేసిన టీచర్ల కు సర్వీస్ పేపర్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కోరారు. పీఆర్సీ కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల, పెన్షనర్ల కోసం వెంటనే కమిటీ వేయాలని, సత్వరమే పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఎల్లా గంగరాజం కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి కరభూజ రవీందర్ తోపాటు మల్లికార్జున్, దరన్ బాబు తోపాటు పలువురు ఉన్నారు.