కేంద్ర బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల మూలంగా చేనేత రంగం మరింత సంక్షోభంలోకి నెట్టబడిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ అన్నారు. లావేరు లో శనివారం నాడు పర్యాటనలో భాగంగా చేనేత కార్మికుల స్ధితిగతులను పరిశీలించారు. చేనేత కార్మికులు సమస్యలపై ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు జీవిత బీమా ద్వారా వచ్చిన స్కాలర్షిప్ సౌకర్యాన్ని అదే విధంగా ప్రమాద బీమాను ఆరోగ్య భీమాను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 20% శాతం జీఎస్టీ చేనేతపై విధించడం వల్ల మగ్గాలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా చేనేత పరిశ్రమకు రిజర్వ్ చేసిన 11 రకాల చేనేత వస్త్రాలను పవర్ మీల్ ద్వారా నేయడం వల్ల చేనేత కార్మికులు పనులు లేక వలస వెళ్లి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా చేనేత కార్మికులపై భారాలవేసి పవర్ లూమ్ కి రాయితీలు బిజెపి ప్రభుత్వం ఇస్తుందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో 45 సంవత్సరాల దాటిన చేనేత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని 200 యూనిట్స్ వరకు ఉచిత కరెంటు ఇస్తామని మూడు సెంట్ల స్థలంలో మగ్గం సెడ్ తో కూడిన ఇల్లు నిర్మిస్తామని వాగ్దానం చేసి హామీలు తుంగలో తొక్కారని విమర్శించారు.
రాష్ట్రంలో రెండు లక్షల మగ్గాలు ఉన్నాయని వీటిపై 9 ఉపవృత్తుల్లో సుమారు 6 లక్షల మంది పనిచేస్తున్నారని కేవలం 81,000 మందికి మాత్రమే వైఎస్ఆర వైయస్సార్ నేస్తం ఇస్తున్నారని వారు ఆరోపించారు .మన జిల్లాలో సుమారు 5000 కుటుంబాలు చేనేతమైన పని చేస్తుంటే కేవలం 1308 మంది మాత్రమే వైయస్సార్ నేస్తం వస్తున్నారని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాలకు ఇవ్వవలసిన నూలు సబ్సిడీ త్రీప్తి ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం 80 కోట్ల రూపాయలు జమ చేయవలసినది జమ చేయకపోవడంతో అనేక సహకార సంఘాలు మూతపడుతున్నాయని వారు విమర్శించారు.
మన జిల్లాలో 15 సహకార సంఘాలు మూతపడ్డాయని వారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ పిల్లలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేయకుండా పవర్లూమ్ కొనుగోలు చేయడం వల్ల చేనేత కార్మికులకు పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జీఎస్టీ రద్దు చేయాలని 11 రకాల చేనేత వస్త్రాలను చేనేత కార్మికులతోనే చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఇ కార్యక్రమం లో సిఐటియు మండల కన్వీనర్ ఎం.గౌరీశంకర్, సిఐటియు జిల్లా కమిటీసభ్యులుఎల్.రాంబాబు,ఎ.ఈశ్వర్రావు,కె.వెంకట్రావు,ఇ.సత్తిబాబు,కె.శ్రీనువాసరావు,కె.కమళ,కె.రామారావు తదితరులు పాల్గొన్నారు.