Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కవిత అరెస్ట్‌ ను తప్పించడానికే.. ఆర్ఎస్ఎస్ అజెండా అమలు

0

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు
న్యూఢిల్లీ ఫిబ్రవరి 16:కోర్టులు మొట్టికాయలు పెట్టినా మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… కేసీఆర్ రూ.600 కోట్లు ప్రజల సొమ్మును కొండగట్టు ఆలయాని కి ఎందుకు ఖర్చు పెడుతున్నారని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ అజెండాను కేసీఆర్ అమలు పరుస్తున్నారని ఆరోపించారు. కూతురు కవిత అరెస్ట్‌ను తప్పించడానికేనా అని ప్రశ్నించారు. కేసీఆర్.. బీజేపీ బీ టీమ్ అని మరోసారి నిరూపించుకుంటున్నారన్నారు. అందుకే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ కావడం లేదని విమర్శించారు. కేసీఆర్ తాను సెక్యులర్ అని చెప్పుకుంటూ చర్చిలకు, మసీదులకు ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు.

రాష్ట్ర ఖజానాలో డబ్బుల లేవని ప్రభుత్వ భూములు అమ్మి వచ్చిన నిధులను ఒకటి, రెండు దేవాలయాలకు ఖర్చు పెడుతున్నారని తెలిపారు. కొండగట్టు ఆలయానికి నిధులు ఇవ్వడాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో సెక్యులర్ ప్రజలు ఈ విషయంపై కేసీఆర్‌ను ప్రశ్నించాలన్నారు. డబ్బుల కోసం కమ్యూనిస్టులు కేసీఆర్ దగ్గరకే కాదు ఎక్కడికైనా వెళతారని అన్నారు. ఏప్రిల్ 14న తెలంగాణ సచివాలయం ప్రారంభోత్సవానికి ఒప్పుకున్నారు కాబట్టి రేపు తెలంగాణ ప్రజలుకలెక్టరేట్‌లను ముట్టడించవద్దని పాల్ విజ్ఞప్తి చేశారు. తాను నిజమైన హిందువును అని.. హిందువుగానే చనిపోతాను.. కానీ ఏసుక్రీస్తును ఫాలో అవుతాను అంటూ కేఏపాల్ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie