పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యపురం గ్రామం లో ఎదురు మదురు గా రెండు డీసీఎం మినీ లారీ లు ఢీ కొన్నాయి. వినుకొండ నుండి ఎండు మిరపకాయ లోడు తో గుంటూరు వెళ్తున్న లారీ, మరో లారీ గుంటూరు నుండి కూరగాయల లోడు తో వస్తూ బుధవారం ఉదయం ప్రమాదానికి గురయ్యాయి. ఘటనలో ఒక లారీ డ్రైవర్ కు కాలు విరగటం తో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించించారు. మరో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు..