తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో భాగంగా ఈ నెల 28 తేదీ నుండి 30 తేదీ వరకు జరగ బోయే రాష్ట్రస్థాయి సీఎం కప్ ఖోఖో పోటీలకు టెక్నికల్ ఆఫీసల్స్ గా కోరుట్ల పట్టణానికి చెందిన వాసం నవీన్ కుమార్ ఎంపికయ్యారు.
వీరి ఎంపిక పట్ల రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ, గంగాధర్, కోరుట్ల ఖోఖో ప్రెసిడెంట్ పెండం గణేష్ ,యువజన సంఘం ప్రధాన కార్యదర్శి పుప్పాల నాగరాజు,వ్యాయామ ఉపాధ్యాయులు వి.రాజు ,జి రవీందర్ ,విజయ్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు..