విశాఖపట్నం:విశాఖ సిటీ పోలీసులు , సెబ్ పోలీసు లు సంయుక్తంగా 338 కేసుల్లో 6459 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ట్టు నగర పోలీసు కమిషనర్ శ్రీకాంత్ వెల్లడించారు.విశాఖపై కొందరు పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నా రని, అందుకే ఎప్పుడెప్పుడు. ఎక్కడ క్కడ గంజాయిని స్వాధీనం చేసుకు న్నామో, పోలీసులు, సెబ్ అధికారులు ఎంత అలెర్టుగా ఉన్నారో చెప్పడానికి ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నా రు. గత ఏడాది జనవరి నుంచి ఈ ఏడాది జనవరి 31వ తేదీ వరకు 852 మంది నిందితులను అరెస్టు చేసినట్టు చెప్పారు.
ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ గంజాయికి ప్రధాన వనరుగా ఉందని, అక్కడ నుంచి విశాఖ నగరం మీదుగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. 77 కేసుల్లో 4604 కిలోలు స్వాధీనం చేసుకున్నా మన్నారు.స్వాధీనం చేసుకున్న మొత్తం 6459 కిలోల గంజాయిలో 2880 కిలోల గంజాయి ప్రధానంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్. ఢిల్లీ. బీహార్. మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణా టక , తెలంగాణలకు రాష్ట్రాలకు రవాణా అవుతోందని సీపీ చెప్పారు.