పులివెందుల
పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె పట్టణంలో తెల్లవారు జామునే బార్ లో మద్యం అమ్మకాలు కొనసాగుతున్న పట్టించుకోక పోవడం పట్ల పలు విమర్శలకు దారి తీస్తోంది. బార్ షాపు యాజమాని ఎక్సైజ్ అధికారులను ప్రసన్నం చేసుకోవడం వల్లే ఈ బార్ షాపు మద్యం అమ్మకాల దందా కోడి కూయక ముందే నడుస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు నిజం చేస్తూ వేంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్ లో ఉన్న బార్ నిర్వాహకులు ఇష్టారాజ్యంగా మద్యం అమ్మకాలు జరుపుతున్నారు.
మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బార్ షాపును నియంత్రిచాల్సిన పోలీసులు సైతం గమ్మున ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ బార్ యజమానికి ప్రజాప్రతినిధుల, ఎక్సైజ్, పోలీసుల అండదండలు ఉండడం మూలంగానే ఎలాంటి భయం లేకుండా తెల్లవారుజామునే విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇకనైనా ఎక్సైజ్ అధికారులు కళ్ళు తెరిచి తెల్లవారుజామునే మద్యం అమ్మకాలు చేస్తున్న బార్ షాపులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.