అంతరాష్ట్ర ఘరానా దొంగల ముఠా అరెస్టు
తిరుపతి
తిరుపతి నగరంలో సంచలనం సృష్టించిన ఏటీఎం దొంగతనానికి పాల్పడిన అంతర్రాష్ట్ర హర్యానా గ్యాంగ్ దొంగల ముఠా అరెస్ట్ అయింది. నిందితులనుంచి 2 లక్షల రూపాయల నగదు, 2 లారీలు, ఒక ఈకో O కారు, రెండు నాటు తుపాకులు, ఒక గ్యాస్ గన్, 21 కేజీల గంజాయి, ఒక గ్యాస్ సిలిండర్, ఒక ఆక్సిజన్ సిలిండర్ లు స్వాధీనం చేసుకున్ఆరు. ట్టుబడ్డ 6 మంది నిందితులు కరుడు గట్టిన హర్యానా కు చెందిన మేవాత్ గ్యాంగ్ నేరగాళ్లు గా గుర్తించారు. గత నెల 14.09.2023 వ తేదీన తెల్లవారు జామున 03:15 గంటలకు తిరుపతి రూరల్ మండలం, ధనలక్ష్మి నగర్, కెనరా బ్యాంక్ ఏటీఎం ను పగులకొట్టి 18,26,500/- రూపాయలను ముఠా దొంగిలించింది. జిల్లా ఎస్పి పి.పరమేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ కేసును ఒక సవాలుగా తీసుకుని రెండు ప్రత్యేక బృందాలనుఏర్పాటు చేసి, తిరుపతి రూరల్ సిఐ సుబ్రమణ్యం రెడ్డి యొక్క బృందాన్ని ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు, చంద్రగిరి సిఐ రాజశేఖర్ యొక్క బృందాన్ని చేసి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పంపడమైనదన్నారు.
ఈ నేపథ్యంలో గురువారం నాడు నేరస్థుల ముందస్తు సమాచారము మేరకు తిరుపతి రూరల్ మండలము, గరుడాద్రి అపార్ట్మెంట్స్ ముందర సదరు నేరస్థుల కదలికలు ఉన్నాయని తెలిసి అక్కడ నిందితలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు సద్దాం ఖాన్, వసీమ్, అర్షద్ ఖాన్, ముర్ సలీం, ఇర్షాద్ @ అఫ్సర్ ఖాన్, నసీరుద్దీన్ @ నస్రు..గతంలో నిందితులు విజయనగరం, చింతామణి, చిక్కమగలూరు, తుమకూరు నగరాలలో ఏటీఎం నేరాలు చేసి తప్పించుకు తిరుగుతున్నట్లు తెలిసిందన్నారు.
వీరు కర్ణాటక, తమిళ నాడు వంటి దక్షిణాది రాష్ట్రాలలో తక్కువ రేటుకు గంజాయిని కొనుక్కొని వారి స్వరాష్ట్రములో ఎక్కువ రేటుకు అమ్ముకునే నేరము కూడా చేస్తున్నారని తమ ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఈ కేసును చేదించి, దొంగలను అరెస్టు చేసి నగదు స్వాధీనం చేసుకోవడంలో విశేష కృషి చేసిన చంద్రగిరి డిఎస్పీ యశ్వంత్, సీఐలు సుబ్రహ్మణ్యం రెడ్డి,రాజశేఖర్, ఎస్సైలు జగన్నాథరెడ్డి, నాగేంద్రబాబు, ఏఎస్ఐలు రాఘవ, రాము, మహేంద్ర రెడ్డి, హెచ్ సిలు విశ్వనాథం, కిషోర్ కుమార్, పిసీలు గౌస్ ఆరిఫ్, శ్రీనివాసులు, పురంధర్, ఎం ప్రసాద్, ప్రభాకర్, ఎల్బి ప్రసాద్, మునిరత్నం, కార్తీక్, రమణారావు, రాజా, ఎంఎల్ నాయుడు, సుధీర్ కుమార్ రెడ్డి, నాగార్జున లను జిల్లా ఎస్పిఅభినందించి ప్రశంసా పత్రాలను అందజేసి, రివార్డులను ప్రకటించారు.