దివంగత మంత్రి, మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థం నాలుగున్నర కోట్ల రూపాయలతో నిర్మించిన గౌతమ్ రెడ్డి మునిసిపల్ బస్ స్టాండ్ ను రాష్ట్ర మంత్రులు స్థానిక ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభించారు. మేకపాటి విక్రమ్ రెడ్డి సొంత నిధులు వెచ్చించి ఈ బస్టాండ్ నిర్మించిని విషయం తెలిసిందే. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేసిన తన అన్న మేకపాటి గౌతమ రెడ్డి జ్ఞాపకార్థం ఈ బస్టాండ్ నిర్మించామని మేకపాటి కుటుంబ సభ్యులు తెలిపారు. మున్ముందు నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కూడా ఇలాంటి బస్టాండ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు.
నియోజకవర్గంలో ఏ ఒక్కరికి ఏ కష్టం వచ్చినా మేమున్నామంటూ భరోసా కల్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గానికి మేకపాటి విక్రమ్ రెడ్డి లాంటి ఎమ్మెల్యే దొరకటం మీ అదృష్టం అన్నారు. విక్రమ్ రెడ్డి కుర్రవాడు అని చాలా చక్కగా పనిచేస్తున్నాడని మళ్లీ మళ్లీ విక్రమ్ రెడ్డిని గెలిపించాలని ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. మేకపాటి విక్రమ్ రెడ్డి తండ్రి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం నిరంతరం ప్రజల కోసమే పని చేస్తుందన్నారు. ఇప్పుడు కానీ ముందు ముందు గానీ ఎప్పుడు కూడా మేకపాటి కుటుంబం అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ గా ఉంటుందని ఎలాంటి ఆరోపణలు రాకుండా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు.
దేశంలో కొత్త విద్యుత్ ఛార్జీలు..
మేము పది మందికి సహాయం చేసే వాళ్ళమే గాని ఎలాంటి ఆరోపణలు ఎదుర్కొనే స్థాయికి ఎప్పటికీ రామన్నారు. విక్రమ్ రెడ్డి చాలా మంచివాడని మనసున్న వ్యక్తి అని ప్రజలు మళ్ళీ మళ్ళీ ఆశీర్వదించాలని కోరారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి కూడా తమ తమ్ముడు మేకపాటి రాజగోపాల్ రెడ్డిని త్వరలోనే అధిష్టానం ఇన్చార్జిగా నియమిస్తుందని ఆయనను కూడా ఆశీర్వదించాలని కోరారు.ఏది ఏమైనా ఆత్మకూరు నియోజకవర్గం లో నిర్మించిన మేకపాటి గౌతమ్ రెడ్డి బస్టాండు చాలా అద్భుతంగా ఉంది ఆస్ట్రేలియాలోని క్రికెట్ స్టేడియం అయిన గబ్బా స్టేడియం లాగా అద్భుతంగా తీర్చిదిద్దారు .త్వరలో జరిగే సాధారణ ఎన్నికల్లో విక్రం రెడ్డిని భారీ మెజారిటీ గెలిపించి మంత్రివర్గంలోకి అడుగుపెట్టే విధంగా చూసుకుంటామని నియోజకవర్గ ప్రజలు నినాదాలు చేశారు