ఈ నెల 13 న గోనెగండ్ల లో జగనన్నకు చెబుదాం స్పందన జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
కర్నూలు
ఈనెల 13 వ తేదీన గోనెగండ్ల మండల కేంద్రం లో జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోనెగండ్ల ఎంపిడిఓ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జగనన్నకు చెబుదాం – స్పందన కార్యక్రమం ద్వారా ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరిస్తామని, ఈ అవకాశాన్ని మండల ప్రజలు సద్వినియోగం
చేసుకోవాలని కలెక్టర్ కోరారు.