చేతివృత్తుల వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే రాయితీతో కూడిన రుణాలను స్వర్ణకారులందరు సద్వినియోగపరచుకోవాలని ఎం ఎస్ ఎం ఈ అసిస్టెంట్ డైరెక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎం ఎస్ ఎం ఈ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని వివిధ బ్యాంక్ అధికారులతో స్వర్ణకారులతో స్థానిక సిరి ఫంక్షన్ హాల్లో జరిగిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరతరాలుగా కులవృత్తులను నమ్ముకున్న చేతివృత్తులదారులను ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
వివిధ సబ్సిడీ రుణాలను అందిస్తున్నారని, అందులో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లభించే సబ్సిడీ రుణాలను అందించడానికి తమ వంతుగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మేనేజర్ మధుసూదనాచారి, బి ఐ ఎస్ హాల్ మార్క్ ప్రతినిధులు ప్రశాంతి, తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి కందుకూరి పూర్ణచారి, పెద్దపల్లి జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్ష, ప్రధాన
కార్యదర్శులు రంగు శ్రీనివాస్, శ్రీరామోజు రాజు, నాయకులు బసవపాత్రుని వెంకట నరసయ్య, కనపర్తి భాస్కరాచారి, విజయగిరి శ్రీనివాస్, కట్ట సదానందం, కందుకూరి ప్రకాష్ రావు, కొండపర్తి నరహరి కట్ట శ్రీధరాచారి, గాలిపెళ్లి రమేష్, అధికారులు సంఖ్యలో స్వర్ణకారులు పాల్గొన్నారు.