కౌతాళం మంత్రాలయం నియోజకవర్గం నదిచాగి గ్రామంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకులు రామన గౌడ ఆధ్వర్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఎంపీ అభ్యర్థి బివై రామయ్య మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డి తరపున ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది, రామన్నగౌడ మరియు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నదిచాగి గ్రామంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ జగన్ ప్రభుత్వంలో మన గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తుచేసుకుని అలాగే పార్టీలకు అతీతంగా,అన్ని వర్గాలకు అందించిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ, సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మే 13 న మరొక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తు పై ఒకటి ఎమ్మెల్యే,ఇంకొకటి ఎంపీ అభ్యర్థులకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు,వృద్దులు ఎంపీటీసీ లింగన్నగౌడ తో మాకు సచివాలయం, బ్యాంకులద్వార ఇస్తున్న పెన్షన్ మా చేతికి అందకుండా అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ ఉండాలని అలాగే కొందరికి రుణాలు ఉన్నవారికి నగదు ఇవ్వడంలేదని,మరికొందరి సహకార బ్యాంకులకు జమ కావడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నామని ఎంపీటీసీ లింగన్నగౌడ దృష్టికి తీసుకురాగా చంద్రబాబు వలంటర్లను అడ్డుకోవడం ద్వారా ఈ దుస్థితి ఏర్పడిందని,జూన్ 4 వతేది నతరం జగన్ ప్రభుత్వం రాగానే మళ్లీ వలంటీర్ల వ్యవస్త కొనసాగిస్తూ వృద్దులకు ఇంటింటికీ పెన్షన్లు అందిస్తామని వృద్దులకు చెప్పుకొచ్చారు, ఎన్నికల ప్రచారంలో పెద్దఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.