హైదరాబాద్
సుధీర్గ రాజకీయ జీవితంలో దివంగత కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని నేటి తరం రాజకీయ నాయకులు వారిని ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం జైపాల్ రెడ్డి గారి జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్ లోని స్ఫూర్తి స్థల్( జైపాల్ రెడ్డి మెమోరియల్ ప్లేస్) లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని అన్నారు. కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో బాధ్యతలు నిర్వహించిన జైపాల్ రెడ్డి రాష్ట్రానికి చేసిన సేవలను కొనియాడారు. వీరికి ఉత్తమ పార్లమెంటేరియన్ గా గుర్తింపు వచ్చిందని, ఎలాంటి అవినీతి మరకలు లేని వ్యక్తి అని ప్రశంసించారు. ఏ విషయమైనా ముక్కుసూటిగా వ్యవహరించేవారని, అప్పటి రాజకీయ నాయకులలో అరుదైన వ్యక్తిత్వం కలిగి ఉండేవారని అన్నారు.
ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నీటిపారుదల శాఖ మాత్యులు ఉత్తంకుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, , రాజ్యసభ సభ్యులు కే కేశవరావు, నగర మేయర్ విజయలక్ష్మి, శాసనసభ, శాసనమండలి సభ్యులు మాజీ పార్లమెంట్ సభ్యులు,మాజీ శాసనసభ, శాసనమండలి సభ్యులు, జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు ఆధ్యాత్మిక వాది దైవజ్ఞ శర్మ తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post