వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యం
బేతంచెర్ల
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ప్రతి కార్యకర్త నాయకుడు తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని మండల కన్వీనర్ ఉన్నాం ఎల్లా నాగయ్య ,పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్షవాలి చౌదరి అన్నారు. నగర పంచాయతీ 14 వార్డు డ్రైవర్స్ కాలనీ నందు బాబు షూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం స్థానిక టిడిపి నాయకులు మేకల నాగరాజు, రూబిన్, రాంగోపాల్, బూత్ ఇంచార్జ్ కానాల అంజి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదళిత గిరిజన మైనార్టీ వర్గాల వారికి ఉన్నత పదవులు ఇచ్చి వారికి సముచిత స్థానం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్ని వర్గాల వారికి సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. టిడిపిప్రవేశపెట్టిన పథకాలను ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర నాయక్ జావాజీ వెంకటేశ్వర్లు, మాదినేని నారాయణస్వామి వంశీకృష్ణ, కనపకుంట మధుసూదన్ రెడ్డి, వినయ్ చౌదరి కంది కాయల అరుణ్ కుమార్, ఎస్వి సుబ్బారెడ్డి, మురళి, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.