Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

వజ్రానికి డబ్బులు తక్కువ ఇచ్చారు

0

అనంతపురం, సెప్టెంబర్ 22, (న్యూస్ పల్స్)

అనంతపురం జిల్లాలో అధికారులకు ఓ రైతు, స్థానికులు ఫిర్యాదుచేశాడు. వజ్రాన్ని కొనుగోలు చేసి వ్యాపారి రైతుకు చాలా తక్కువ మొత్తాన్ని చెల్లించారని.. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్డీవో, తహసీల్దార్‌‌కు ఫిర్యాదు చేశారు. గుంతకల్లు మండలం శంకరబండికి చెందిన ఓ రైతుకు మూడు రోజుల కిందట పొలంలో వజ్రం దొరకింది.. వెంటనే ఆ వజ్రాన్ని కర్నూలు జిల్లా పెరవలి గ్రామంలోని వజ్రాల వ్యాపారికి రూ.9.50 లక్షలకు విక్రయించాడు. ఈ విషయం గ్రామస్థులకు తెలియడంతో వ్యాపారి రైతు నుంచి మంచి వజ్రాన్ని తీసుకుని తక్కువ మొత్తం ఇచ్చాడని అధికారులకు ఫిర్యాదు చేశారు.తన వజ్రానికి ఎక్కువ మొత్తాన్ని ఇవ్వాలని సంబంధిత రైతు వ్యాపారిని అడగగా.. అతడు నిరాకరించడంతో ఈ వ్యవహారం బయటపడింది. వజ్రం రూ.9.50 లక్షల కంటే ఎక్కువ ఖరీదు ఉండదనీ.. తన డబ్బు వాపసు ఇచ్చి వజ్రాన్ని తీసుకుపోవాలని వ్యాపారి రైతుకు తెలియజేశారని గ్రామస్థులు చెప్పారు.

ఈ విషయంలో రైతును మోసగించిన వ్యాపారిపై తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ అంశంపై విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామస్థులకు హామీ ఇచ్చారు. వజ్రానికి తక్కువ ధర చెల్లించారని వ్యాపారిపై ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయ్యింది.తొలకరి వానల తర్వాత అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. ఈ సీజన్‌లో కూడా పలువురు రైతులు, కూలీలకు వజ్రాలు చిక్కాయి. వజ్రం క్వాలిటీని బట్టి వ్యాపారులు డబ్బులు చెల్లిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు తన దగ్గర వజ్రాన్ని తక్కువ ధరకు వ్యాపారి కొనుగోలు చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా ఓ రైతు తక్కువ ధరకే వజ్రాన్ని వ్యాపారికి అమ్మేశాడు.. కానీ ఆ తర్వాత మార్కెట్‌లో ఇంకా ఎక్కువ ధరకు కొనుగోలు చేసేవారని తెలియడంతో వాపోయాడు

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie