వైసిపి యువ లీడర్ దాట్లా సుబ్బరాజు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించండి వైసీపీ నాయకులు
కౌతాళం, అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలకు అభివృద్ధి బాటలో నడిపించిన నాయకుడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని చెప్పిన ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు .ఎమ్మెల్యేగా బాలనాగి రెడ్డిని నాలగవ సారి గెలి పించుకుందామని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించా లని ప్రజలను వైసిపి యువ లీడర్ ధాట్ల సుబ్బ రాజు, రాఘవేంద్ర రెడ్డి,కోరారు. ఈ మేరకు సోమవారం మండల కేంద్రమైన కౌతాళంలోని జంగల కలని, గ్యాస్ గౌడన్, ఎన్టీఆర్ కలని, బయటి గేరి మారెమ్మ గుడి ప్రాం తాల్లో జోరుగా వైసిపి ఎన్నికల ప్రచారాన్ని మండల యువ లీడర్ దాట్లా సుబ్బరాజు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసే ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అలాంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకోవాలన్నారు. ఓటర్లు అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి బి వై రామయ్య, మం త్రాలయం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డిలకు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. వైసీపీ హయంలోనే అభి వృద్ధి సాధ్య పడిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర రెడ్డి, గణపతి రాజు, కుమార్, ఉలిగయ్యా, మోదిన్ సాబ్,ఉపేంద్ర, రాజమద్ ,సత్య గౌడ్, వీరేష్, చాకలి లింగన్న, జంబయ్య రాముడు నరసింహులు,తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post