Maharashtra : మహారాష్ట్రలో సంచలనం: ‘లాడ్కి బహీన్’ పథకంలో 14 వేల మంది మగవాళ్లకు డబ్బులు!

Massive Scam in Maharashtra's Ladli Bahin Scheme: 14,000 Men Receive Funds

Maharashtra : మహారాష్ట్రలో సంచలనం: ‘లాడ్కి బహీన్’ పథకంలో 14 వేల మంది మగవాళ్లకు డబ్బులు:మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘లాడ్కి బహీన్’ పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఆడిట్‌లో shocking విషయాలు బయటపడ్డాయి.

మహిళా పథకంలో పురుషుల దందా: రూ. 21 కోట్ల మేర నష్టం!

మహారాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన ‘లాడ్కి బహీన్’ పథకంలో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ ఆడిట్‌లో shocking విషయాలు బయటపడ్డాయి. ఏకంగా 14 వేల మంది పురుషులు ప్రతి నెలా ఈ పథకం కింద డబ్బులు అందుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

ఈ అక్రమాలపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ తీవ్రంగా స్పందించారు. ‘లాడ్కి బహీన్’ పథకంలో అవినీతిని ఏమాత్రం సహించేది లేదని, అక్రమంగా డబ్బులు పొందిన వారి నుంచి మొత్తం తిరిగి వసూలు చేస్తామని స్పష్టం చేశారు. దీనికి సహకరించని వారిని జైలుకు పంపించడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు.

మహాయుతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహారాష్ట్రలో ‘లాడ్కి బహీన్’ పథకాన్ని ప్రారంభించింది. 18 నుంచి 65 ఏళ్లలోపు ఉన్న పేద మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల లోపు ఉన్న కుటుంబాల్లో గరిష్ఠంగా ఇద్దరు మహిళలకు ఈ పథకం వర్తిస్తుంది.

అయితే, పథకం ప్రారంభించిన కొద్ది రోజులకే పెద్ద ఎత్తున అక్రమాలు బయటపడ్డాయి. 14 వేల మందికి పైగా పురుషులు మహిళల పేరుతో ఈ పథకం లబ్ధి పొందుతున్నారని తాజాగా జరిగిన ఆడిట్ నివేదికలో తేలింది. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ. 21.44 కోట్ల నష్టం వాటిల్లినట్లు స్పష్టమైంది. ఈ అవినీతిపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేస్తున్నాయి. అజిత్ పవార్ కూడా అక్రమార్కులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

Read also:KTR : మద్యం పాలనగా మారిన తెలంగాణ? కేటీఆర్ ప్రశ్నలు

 

Related posts

Leave a Comment