Patna : పాట్నాలో భారీ వర్షాలకు కూలిన ఫ్లైఓవర్:బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల నిర్మించిన ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది. రూ.422 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్రారంభించారు.
భారీ వర్షాల కారణంగా పాట్నాలోని డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కుంగిపోయింది.
బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల నిర్మించిన ఒక డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ భారీ వర్షాల కారణంగా కుంగిపోయింది. రూ.422 కోట్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండు నెలల క్రితమే ప్రారంభించారు. ట్రాఫిక్ను తగ్గించడానికి అశోక్ రాజ్పథ్లో నిర్మించిన ఈ 2.2 కిలోమీటర్ల ఫ్లైఓవర్లో, ఆదివారం కురిసిన వర్షాలకు మధ్యలో ఒక పెద్ద గొయ్యి ఏర్పడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బీహార్ స్టేట్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఫ్లైఓవర్ను నిర్మించింది. ఇంత భారీ బడ్జెట్తో నిర్మించిన ప్రాజెక్టు నాణ్యతపై ప్రజలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు.గత 24 గంటలుగా పాట్నాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల కంకర్బాగ్, రాజేంద్ర నగర్, ఎగ్జిబిషన్ రోడ్ వంటి అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాతావరణ శాఖ పాట్నాతో పాటు మరో 13 జిల్లాలకు రాబోయే 48 గంటలకు ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
Read also:Telangana : సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ వ్యాఖ్యలు.. కౌంటరిచ్చిన కోమటిరెడ్డి
