Nagarjuna Sagar : భారీ వర్షాలతో కృష్ణానదికి పోటెత్తుతున్న వరద:తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది.
సాగర్ ప్రస్తుత నీటిమట్టం 589.30
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. ప్రాజెక్టులోని మొత్తం 26 గేట్లలో 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్లోకి 1,74,533 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 2,33,041 క్యూసెక్కుల నీటిని బయటికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం అది 589.30 అడుగులుగా ఉంది. అలాగే, ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా, ఇప్పుడు 309.95 టీఎంసీలకు చేరింది.
Read also:Balakrishna : అమరావతి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి శంకుస్థాపన
