SaiPallavi : తమిళనాడు ప్రభుత్వం నుంచి ‘కళైమామణి’ అవార్డు అందుకున్న సాయి పల్లవి

Sai Pallavi Wins Prestigious 'Kalaimamani' Award
  • నటి సాయి పల్లవికి ‘కళైమామణి’ పురస్కారం

  • 2021 సంవత్సరానికి గాను ప్రకటించిన తమిళనాడు ప్రభుత్వం

  • సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కూడా దక్కిన గౌరవం

ప్రముఖ నటి సాయి పల్లవి తమిళనాడు ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘కళైమామణి’ పురస్కారానికి ఎంపికయ్యారు. కళారంగంలో ఆమె చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ గౌరవం దక్కింది.తమిళనాడు ప్రభుత్వం తాజాగా 2021, 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన కళైమామణి పురస్కారాల విజేతలను ప్రకటించింది. ఇందులో భాగంగా, 2021 సంవత్సరానికి గాను నటి సాయి పల్లవికి ఈ అవార్డు లభించింది. ఆమెతో పాటు ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ (2023), దర్శకులు ఎస్.జె. సూర్య, లింగుసామి, నటులు విక్రమ్ ప్రభు, మణికందన్ వంటి వారు కూడా ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.

సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళా రంగాల్లో విశేషమైన కృషి చేసిన వారికి ఏటా ఈ పురస్కారాన్ని తమిళనాడు ప్రభుత్వం అందిస్తుంది. ఈ అవార్డు కింద విజేతలకు మూడు సవర్ల బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. త్వరలో జరిగే ఓ కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా విజేతలకు ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

Read also : Telangana : టీజీపీఎస్సీకి హైకోర్టులో ఊరట: గ్రూప్ 1 వివాదంపై సంచలన తీర్పు

 

Related posts

Leave a Comment