చిన్నారులతో కలిసి డిన్నర్ చేసిన మంత్రి సీతక్క హైదరాబాద్ సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సుకోసం వినియోగించాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవ భావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. చిన్ననాటి ఉంటే పిల్లల్లో పెద్దలపట్ల సమాజం పట్ల ఎలా నడుచుకోవాలి నేర్పించాలని హితవు పలికారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఏఎస్ఎఫ్ బిబిక్యూ & గ్రిల్ రెస్టారెంట్ లో ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి ఆమె కాసేపు సరదాగా గడిపారు. వారి యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమంలో చిన్నారులతో పాటు మంత్రి పాలుపంచుకొని వారిలో ఆనందాన్ని నింపారు. సామాజిక బాధ్యతగా చిన్నారులకు మంచి రుచికరమైన నాణ్యమైన ఆహారం అందించాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం…
Read MoreAuthor: Admin
Congress : ఢిల్లీ కాంగ్రెస్ కు ఏమైంది…
ఢిల్లీ కాంగ్రెస్ కు ఏమైంది… న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరింది. 12 ఏళ్లుగా ఢిల్లీని పాలించిన ఆప్.. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. ఎటొచ్చి ఈ ఎన్నికలు మరోసారి కాంగ్రెస్కు తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఆప్, బీజేపీ మధ్యే ఉంటుందని మొదటి నుంచి అంతా భావించారు. అయితే ఒకప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో వరుస విజయాలు సాధించిన కాంగ్రెస్.. ఈసారి ఏమైనా ఊహించని ఫలితాలు సాధిస్తుందేమో అని ఆ పార్టీ నేతలు, శ్రేణులు ఆశపడ్డాయి. కానీ అలా ఆశించిన వారికి మరోసారి నిరాశ తప్పలేదు.పూర్వ వైభవాన్ని చాటుకునే పరిస్థితులు లేకున్నా, కనీస 10 స్థానాలనైనా గెలుచుకునేలా చివరి దశ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ,…
Read MorePiracy : టాలీవుడ్ పై పైరసి భూతం
టాలీవుడ్ పై పైరసి భూతం హైదరాబాద్ ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) టాలీవుడ్ ను పైరసీ భూతం వెంటాడుతోంది. ఏ సినిమా అయినా…థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఆన్ లైన్ లో దర్శనం ఇస్తుంది. పవన్ కల్యాణ్ అత్తారింటిది దారేది చిత్రం నుంచి తాజాగా విడుదలైన తండేల్ వరకు ఎన్నో చిత్రాలు పైరసీ బారిన పడినవే. వందల కోట్లు పెట్టుబడిగా పెట్టి వందల వంది టెక్నీషియన్లతో నెలల పాటు తీసిన చిత్ర బృందం కష్టాన్ని గంటల వ్యవధిలో బూడిదపాలు చేస్తున్నారు. పైరసీ వెబ్ సైట్స్, ఫ్యాన్స్ వార్…ఇలా కారణాలు ఏమైనా చివరికి నష్టపోయేది సినిమా నిర్మాతలే.పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలు ఉన్నా…ఎంత వరకూ ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న. ఎంత మంది నిందితులను చట్టం ముందు నిలబెట్టారనే ప్రశ్నలు తలెత్తు్తున్నాయి. టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్న…
Read MoreMaoists : మావోలపై ముప్పేట దాడి….
మావోలపై ముప్పేట దాడి…. హైదరాబాద్ ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్) వరుస ఎన్ కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్ ఘడ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఏరివేత లో భాగంగా ఎన్ కౌంటర్ లు నిత్యకృతయమయ్యాయి. ఒక ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరుగుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. నిన్న ఆదివారం ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందగా. మృతుల్లో 11 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ…
Read MoreTelangana Forests : తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం…
– తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం… హైదరాబాద్, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) తెలంగాణ అడవులు గత కొన్నేళ్లుగా బాగా పెరగడం లేదు. థిక్ ఫారెస్ట్ అన్నది లేదు. అంతా పలుచబడి పోయాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కేవలం 454 చదరపు కిలోమీటర్లలోనే పాతవిగా పరిగణించే చెట్లున్నాయి. వన్యప్రాణి అభయారణ్యాలు, నేషనల్ పార్క్ వంటి రక్షిత ప్రాంతాలకు వెలుపల ఉన్న మిగిలిన అడవులు చాలా చిన్న చెట్లతోనే కనిపిస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. పాత అడవులు క్రమంగా కనుమరుగవుతున్న విషయాన్ని రిపోర్ట్ స్పష్టంగా ప్రస్తావించింది. అంతే కాదు తెలంగాణలోని 13,480 చదరపు కిలోమీటర్ల రేంజ్ లోని రిజర్వ్ ఫారెస్ట్లలో చెట్ల బెరడును తీసేసి, చెట్టు మొదలులో లోపలికి కోత పెట్టి.. దాన్ని డెడ్ వుడ్ గా మార్చే…
Read MoreHydra ; రెడీ అవుతున్న హైడ్రా యాప్
రెడీ అవుతున్న హైడ్రా యాప్ హైదరాబాద్, డిసెంబర 26, (న్యూస్ పల్స్) చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో నిర్మాన అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్.. పలు జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై ఆయన స్పష్టమైన వివరణిచ్చారు.హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్టీఎల్లో…
Read MorePawan Kalyan : ఏజెన్సీ ప్రాంతాలపై పవన్ ఫోకస్
ఏజెన్సీ ప్రాంతాలపై పవన్ ఫోకస్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించినప్పుడు ఈ పార్టీ ఉంటుందా.. ప్రజారాజ్యం పార్టీలో లాగా కాలగర్భంలో కలిసిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తాయి. కానీ జనసేనానిని రాజకీయాల్లో తన బలమేంటో చూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు చవి చూశారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి పోటీ చేయకుండా ప్రభుత్వ ఏర్పాట్లులో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిని, ఒంటరిపోరుకు తన బలం సరిపోదని అర్థం చేసుకున్నారు.2024 ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు తానే ముందుండి చొరవ తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేయడమే కాదు 151 యొక్క సీట్లతో గెలిచామన్నా వైసీపీ గర్వాన్ని అణచివేశారు .. 2024…
Read MoreVizag Steel : ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్
– ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్)ను ప్రైవేటీకరణ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో చర్యలకు పూనుకుంటుంది. అందులో భాగంగానే స్టీల్ప్లాంట్లోని ఒక్కో భాగం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడింది. వైజాగ్ స్టీల్ప్లాంట్లోని వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రకటన వెలువడిన తరువాత ఒక్కొక్క చర్యలు చేపట్టింది.ఇప్పటికే దాదాపు 2,000 మంది ఉద్యోగులను ఛత్తీస్గడ్లోని నాగర్నర్ స్టీల్ప్లాంట్కు పంపడానికి సిద్ధపడింది. అలాగే 4,200 మంది స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్ను తొలగించేందుకు వారికి ఎంట్రీ, ఎగ్జిట్ పాస్లను ఇవ్వకుండా కుట్రలు చేసింది. కార్మికులు పోరాటంతో యాజమాన్యం వెనక్కి తగ్గింది. అలాగే బ్లాస్ ఫర్నేస్ను నిలిపివేసింది. ఆక్సిజన్ ప్లాంట్ను నిలిపివేసింది. మళ్లీ కార్మికుల…
Read MoreAndhra Pradesh : పందెం కోళ్లకు డిమాండ్ షురూ
– పందెం కోళ్లకు డిమాండ్ షురూ… ఏలూరు, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) సంక్రాంతి అంటేనే కోడిపందేలు… కోడి పందేలు అంటే సంక్రాంతి.. అలా వుంటుంది క్రేజ్.. ఏపీలో.. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సంక్రాంతి హడావిడిగురించి ఎంత చెప్పినా తక్కువే.. పండగ మూడు రోజులు కోడిపందేల జోష్ ఇక్కడి ప్రజలను ఊపేస్తుంది..కోడిపందేల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. గోదావరి జిల్లాలకే ప్రత్యేకత తెచ్చిన కోడి పందేలకు కోళ్లు సిద్ధమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇప్పటికే రైలు, బస్సు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఇక పందెం రాయుళ్లు హడావిడి కూడా పండుగ ముందు నుంచే మొదలైంది మరో రెండువారాలు దాటితే….కోడిపుంజులను కొనేందుకు ఎగబడతారు పందెం రాయుళ్లు. కండబట్టి పందేనికి సిద్ధంగా ఉన్న ఒక్కో కోడి పుంజు ధర 50 వేల…
Read MoreAP Roads : ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు
ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు విజయవాడ, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అన్నీ అద్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదు. దీంతో రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ నాడు అక్కడకు వెళ్లిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఏపీ రహదారులపై ప్రయాణించడం కష్టమేనని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రహదారులపై సెటైర్లు వేశారు. తనకు ఆంధ్రకు వెళ్లివచ్చిన మిత్రుడొకరు చెప్పారని, ఏపీ రహదారులపై ప్రయాణించడం నరకమేనని అన్నారన్నారు. తెలంగాణలో రహదారులను చూసి గర్వంగా ఉందని కూడా కేటీఆర్ అన్నారు.. అప్పట్లో ఏపీలో రహదారుల పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది.…
Read More