Telugu News eroju varthalu బ్రేకింగ్ న్యూస్ లైవ్ ఆంధ్రప్రదేశ్ న్యూస్ లైవ్

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే కేసీఆర్ నమ్మకం ఎక్కువ ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తారా? బండి సంజయ్..

0

కాంగ్రెస్ లో చేరడమంటే బీఆర్ఎస్ కు సహకరించినట్లేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీఆర్ఎస్ నాయకల కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ నమ్మకం ఉందన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని నడిపిస్తోందే కేసీఆర్ అని, 30 స్థానాల్లో ఆ పార్టీకి డబ్బులు పంపిణీ చేశారని అన్నారు. కాంగ్రెస్ నుండి ఎవరు గెలిచినా మళ్లీ వెళ్లేది బీఆర్ఎస్ లోకేనని చెప్పారు. కేసీఆర్ ను ఓడించాలి.. ప్రజలను ఆదుకోవాలనే లక్ష్యంతో పనిచేస్తున్న నాయకులంతా ఈ  విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. లిక్కర్ నిందితులు తప్పించుకునే వీల్లేకుండా పకడ్బందీగా ఆధారాలు సేకరించే పనిలో సీబీఐ, ఈడీ నిమగ్నమై ఉందన్నారు.

బాలల హక్కుల పరిరక్షణ యోధుడు.. వై లక్ష్మణరావు కి డాక్టరేట్ అవార్డు..

9 ఏళ్లుగా ప్రజలను పట్టించుకోని కేసీఆర్ ప్రచారం కోసం వెయ్యి కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఏనాడూ అమరవీరుల కుటుంబాల ముఖం చూడని కేసీఆర్.. ఇయాళ పిలిచి సన్మానం చేయడం.. శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వెనుక పెద్ద జిమ్మిక్కు అని అన్నారు.
‘‘మహా జనసంపర్క్ అభియాన్’’లో భాగంగా బండి సంజయ్ గురువారం కరీంనగర్ లోని చైతన్యపురి, జ్యోతినగర్ కాలనీల్లో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పేరుపేరునా పలకరిస్తూ  నరేంద్రమోదీ గారి ప్రభుత్వం గత 9 ఏళ్లలో సాధించిన విజయాలు, చేపట్టిన అభివ్రుద్ది, పేదలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. స్టిక్కర్లను స్వయంగా అంటించారు.

Leave A Reply

Your email address will not be published.

Nidhi Agarwal in Harihara Veeramallu Movie | Nidhi Agarwal black saree Mahes Babu Birthday Poster From Gunturu kaaram Movie