AP Tourism : పర్యాటకానికి ఊతమిచ్చేనా

AP Tourism పర్యాటకానికి ఊతమిచ్చేనా

పర్యాటకానికి ఊతమిచ్చేనా విజయవాడ, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) AP Tourism : ఏపీ నూతన టూరిజం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా కొత్త టూరిజం పాలసీని అమల్లోకి తెస్తున్నట్లు స్పష్టం చేసింది. సరైన ప్రోత్సాహం, నిధుల కేటాయింపుతో టూరిజాన్ని మరింత ముందుకు తీసుకెళ్లొచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.రాష్ట్రాలకు ఆదాయాన్ని తెచ్చే శాఖల్లో టూరిజం ఒకటి. సరైన మౌలిక సదుపాయాలు కల్పిస్తే టూరిజం నుంచి అధిక ఆదాయం పొందవచ్చనేదానికి కేరళ ఒక ఉదాహరణ నిలుస్తోంది. ఆ రాష్ట్ర ఆదాయంలో టూరిజంకు ప్రత్యేక స్థానం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో సైతం టూరిజం అభివృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దేశంలోనే ప్రసిద్ధి చెందిన ఆలయాలు, బీచ్ లు, టూరిస్ట్ ప్రదేశాలకు ఏపీ కేంద్రంగా ఉంది. అయితే సరైన ప్రోత్సాహం…

Read More

Vidadala Rajani : విడుదల రజనీ అడ్డంగా బుక్కైనట్టేనా

Vidadala Rajani

విడుదల రజనీ అడ్డంగా బుక్కైనట్టేనా గుంటూరు, డిసెంబర్ 12, (న్యూస్ పల్స్) సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్కను సార్‌ అంటూ..పొలిటికల్ స్క్రీన్‌ మీద అడుగు పెట్టిన ఆమె అనతికాలంలో..అందలమెక్కారు. మొదటిసారి ఎమ్మెల్యే అయి..గత వైసీపీ హయాంలో మంత్రిగా పనిచేశారు విడదల రజిని. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి, రెండేళ్లే మంత్రి పదవిలోనే కొనసాగినా..అంతలోపే లెక్కలేనన్ని ఆరోపణల పాలయ్యారు. పవర్‌లో ఉన్నప్పుడే రజినిపై తీవ్రస్థాయిలో అలిగేషన్స్ వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చాక చిలుకలూరిపేటలో రజిని కరప్షన్ ఫైల్స్ బయటికి వస్తున్నాయి.చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమాని బెదిరించి మాజీ మంత్రి రజిని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్ ఎస్పీ ఐపీఎస్ అధికారి జాషువా.. రజిని పిఎలు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని ఆరోపించింది. రెండు కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల…

Read More

CRDA : 20 పనులకు సీఆర్డీయే ఆమోదం

20 పనులకు సీఆర్డీయే ఆమోదం

20 పనులకు సీఆర్డీయే ఆమోదం విజయవాడ. డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాజధానిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రుణం నుంచి ఈ పనులు చేపట్టనున్నారు. కూటమి సర్కార్ అమరావతి రాజధానిని తిరిగి పట్టాలెక్కిస్తుంది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కాగా…తాజాగా రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్‌ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ. 11,467 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.అమరావతి అభివృద్ధికి…

Read More

Srisailam : స్ప ర్శ దర్శనం పై కీలక నిర్ణయం

స్సర్శ దర్శనం పై కీలక నిర్ణయం కర్నూలు, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) శ్రీశైలం మల్లన్న స్పర్శ దర్శనంపై దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రద్దీ రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లోనూ స్పర్శదర్శనం కల్పిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో ప్రకటించారు. స్పర్శదర్శనంపై శ్రీశైలం దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లోనూ స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం నూతన ఈవో శ్రీనివాసరావు ప్రకటించారు. శని, ఆది, సోమవారాలు, పండుగ రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. భక్తుల రద్దీ సమయాల్లో స్పర్శదర్శనాలు, అభిషేకాలు నిలిపివేస్తూ శ్రీశైలం దేవస్థానం గతంలో నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు దేవస్థానం వైదిక కమిటీ, అధికారులతో చర్చించి రద్దీ సమయాల్లోనూ…

Read More

Vasireddy Padma : జగ్గయ్యపేటపై వాసిరెడ్డి పద్మ  గురి

Vasireddy Padma

జగ్గయ్యపేటపై వాసిరెడ్డి పద్మ గురి   విజయవాడ, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. బహుశ అంతా కుదిరితే ఈ నెలాఖరులోగా ఆమె టీడీలో చేరే అవకాశాలున్నాయి. వాసిరెడ్డి పద్మ చేరికకు అనేకమంది నేతలు అభ్యంతరం చెబుతున్నప్పటికీ ఆమె చేరికకు లైన్ క్లియర్ అయిందంటున్నారు. వాసిరెడ్డి పద్మ మాటకారి. మంచి సబ్జెక్టు ఉన్న నేతగా పేరు. ప్రజారాజ్యం నుంచి ఆమె పార్టీకి అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. ప్రజారాజ్యంలోనూ ఎక్కువ రోజులు ఉండలేదు. తర్వాత ఆమె వైసీపీలో చేరి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు. కానీ వైఎస్ జగన్ మహిళ కమిషన్ ఛైర్ పర్సన్ పదవి వరకే వాసిరెడ్డిని పరిమితం చేశారు. చివరకు జగన్ జిల్లాల పర్యటనలో కూడా ఆమె ఎన్నికల సమయంలో కీలకంగా…

Read More

Yanamala Ramakrishnudu : యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా

Yanamala Ramakrishnudu

యనమల టీడీపీకి గుడ్ బై చెప్పనున్నారా కాకినాడ, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తెలుగుదేశం పార్టీలో కంఫర్ట్ గా లేరని అర్థమవుతుంది. ఆయన అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమయినట్లే కనిపిస్తుంది. అందుకే యనమల నేరుగా పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెడుతూ లేఖ రాశారని తెలుగుదేశం పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. యనమల చేసిన పనికి ఆయన సొంత జిల్లాకు చెందిన, టీడీపీ నేత రెడ్డి సుబ్రహ్మణ్యం అభ్యంతరం తెలిపారంటే.. అది ఆయనకంటూ చేయలేదన్నది సుస్పష్టం. పార్టీ అధినేత నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతనే రెడ్డి సుబ్రహ్మణ్యం యనమలపై విమర్శలకు దిగారని అనుకోవచ్చు. చంద్రబాబు కూడా యనమల చేసిన పనిని సులువుగా తీసుకోవడం లేదు. దీనిపై సీరియస్ గానే ఆలోచించి త్వరలోనే ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలిసింది. అలాగే యనమల…

Read More

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం

అనర్హ పెన్షన్ల ఏరివేతకు రంగం సిద్ధం   గుంటూరు, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) రాష్ట్రంలో పెన్ష‌న్ల‌పై కీల‌క అప్‌డేట్ వ‌చ్చింది. అన‌ర్హ‌ుల పెన్ష‌న్లు ఏరివేత‌కు రంగం సిద్ధ‌మైంది. పెన్ష‌న్లను త‌నిఖీ చేసేందుకు పైల‌ట్ ప్రాజెక్ట్‌తో రాష్ట్ర ప్ర‌భుత్వం అడుగు ముందుకేసింది. పైల‌ట్ ప్రాజెక్ట్‌గా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఒక్కొ స‌చివాల‌యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్నారు.పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హుల ఏరివేతకు ముందడుగు వేసింది. ఈ మేరకు సెర్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) జి.వీరపాండియన్ స‌ర్క్యూల‌ర్ జారీ చేశారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ పెన్షనర్లను వెరిఫికేష‌న్ చేయ‌నున్నట్లు స్పష్టం చేశారు. పెన్ష‌న‌ర్ల వాస్తవ అర్హత స్థితిని నిర్ధారించడానికి పైలట్ ప్రాతిపదికన.. ఒక గ్రామం/వార్డు సెక్రటేరియట్‌లో పెన్షన్‌ల ధృవీకరణ చేయ‌నున్న‌ట్లు వివరించారు.స‌మాజంలోని అన్ని విభాగాల సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరపాండియన్…

Read More

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు విశాఖపట్టణం, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి విశాఖపట్నం పోర్టులో 25 టన్నుల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ ఉన్న కంటైనర్‌ని స్వాధీనం చేసుకుంది.డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు అనుమానం ఉందని, అందుకే ఈ కంటైనర్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు అప్పుడు సీబీఐ పేర్కొంది.ఎనిమిది నెలల తర్వాత.. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కంటైనర్‌లో ఉన్నది కేవలం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమేనని, డ్రగ్స్ కాదని విశాఖ కోర్టు (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కోర్టు)కు సీబీఐ రిపోర్టు అందించింది.దీని ఆధారంగా ఆ కంటైనర్‌ను విడుదల చేసినట్లు విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ చెప్పారు.ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో…

Read More

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి విజయవాడ, డిసెంబర్ 10,(న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. నాగబాబును మంత్రివర్గంలోని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు కేటాయించారు.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు… పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా…జనసేన నుంచి నాగబాబు…

Read More

అనంతలో జేసీ జగడం

జేసీ ప్రభాకర రెడ్డి

అనంతలో జేసీ జగడం అనంతపురం, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) జేసీ ప్రభాకర రెడ్డి సొంత పార్టీ నేతలకే కాదు.. సొంత సామాజికవర్గం నేతలకు కూడా విలన్ గా మారారు. ఆయన పెట్టుకుంటున్న విభేదాలు ఆయనకు మరింత ఇబ్బందిని తెచ్చి పెడతాయంటున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక హిస్టరీ ఉంది. అదే సమయంలో జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జేసీ వేలు పెట్టడంతో అనేక మంది సొంత పార్టీ అంటే టీడీపీ నేతలే వ్యతిరేకమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టడమేంటని పుటపర్లి, అనంతపురం, రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలనే తన శత్రువులుగా మార్చుకున్నారు. అక్కడ తన అనుచరులకు అందం ఎక్కించాలన్న ఆశతో ఆయన అక్కడ ఉన్న అసలైన నేతలకు దూరమయ్యారు. అందుకే గత ఎన్నికల్లో జేసీ కుటుంబానికి కేవలం…

Read More