హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హర్యానా అక్టోబర్ 18 Haryana Assembly Elections 2024 హర్యానాలో ముఖ్యమంత్రిగా నాయబ్సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం సైనీతో సీఎంగా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రమాణం చేయించారు. గురువారం వేడుకగా జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ, ఎపి సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సిఎం యోగి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర సిఎం ఏక్నాథ్ శిండే, గుజరాత్ సిఎం భూపేంద్ర పటేల్, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాగా, ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 49 సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడోసారి బిజెపి హర్యానాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. Maldives vs Modi | మోడీతో మాల్దీవ్ అధ్యక్షుడు భేటీ |…
Read MoreCategory: జాతీయం
National
Predator drones | భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్ డ్రోన్లు | Eeroju news
భారత్ అమ్ములపొదిలోకి…ప్రిడేటర్ డ్రోన్లు న్యూఢిల్లీ, అక్టోబరు 17, (న్యూస్ పల్స్) Predator drones ప్రిడేటర్ డ్రోన్లు చాలా సామర్థ్యం కలిగినవి. అటు ఇంటెలిజెన్స్ సమాచార సేకరణతో పాటు ఈ ప్రెడెటర్ డ్రోన్లు శత్రువును గుర్తించి దాడి చేయగలవు. వాస్తవానికి యుద్ధ భూమిలో సమాచారం ప్రాణవాయువు లాంటిది. కచ్చితమైన టార్గెట్ ను ఎంచుకుని దాడి చేయడానికి సహకరించడంతోపాటు.. ఆయుధాల వృథాను అరికడుతాయి. తాజాగా కొనుగోలు చేసిన ప్రిడేటర్లు దేశ సరిహద్దుల్లో భారత్కు ఆధిపత్యాన్ని అందించనున్నాయి. సముద్ర తీరాల్లోనే కాదు.. హిమాలయ శిఖరాల్లో మన సైన్యానికి కొత్త బలాన్ని తీసుకురానున్నాయి. ఇప్పటికే చైనా వద్ద చియాహాంగ్-4, వింగ్లంగ్-2.. దాయాది దేశం పాకిస్థాన్ వద్ద షహపర్-2, వింగ్లంగ్-2, బైరక్తర్ టీబీ2 వంటి డ్రోన్లు ఉన్నాయి. భారత్ వద్ద ఇప్పటి వరకు ఈ స్థాయి యూఏవీలులేవు. కానీ, ప్రస్తుత ప్రెడేటర్ల రాకతో, వద్ద…
Read MorePriyanka | వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక | Eeroju news
వయానాడ్ నుంచి బరిలోకి ప్రియాంక న్యూఢిల్లీ, అక్టోబరు 16,(న్యూస్ పల్స్) Priyanka మరో కీలక ఎన్నికల సమరానికి నగారా మోగింది. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీలతో పాటు కీలకమైన వయనాడు లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. నవంబర్ 13న వయనాడు పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించనున్నట్టు ఈసీ ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు నవంబర్ 23న వయనాడు ఉప ఎన్నికకు సంబంధించిన ఓట్ల లెక్కింపు జరుగుతుందిఈసారి కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు వయనాడు పార్లమెంట్ ఉప ఎన్నిక ఎంతో ప్రత్యేకమైందనే చెప్పాలి. ఇందుకు ప్రధాన కారణంగా గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేయనుండటమే. గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడుతో పాటు యూపీలోని రాయ్బరేలీ నుంచి పోటీ చేశారు కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ. రెండు స్థానాల్లోనూ భారీ మెజార్టీతో…
Read MoreCEC Rajeev Kumar | ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. | Eeroju news
ట్యాంపరింగ్ సాధ్యం కాదు.. క్లారిటీ ఇచ్చిన సీఈసీ రాజీవ్కుమార్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) CEC Rajeev Kumar మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలవేళ ఈవీఎం లపై దుమారం మొదైలంది.. హర్యానా ఎన్నికల ఫలితాల అనంతరం ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తంచేస్తోంది. బ్యాలెట్ ఎన్నికల కోసం పట్టుబట్టాలంటూ కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.. అయితే.. ఈవీఎం లపై అనుమానాలను కొట్టిపారేసిన సీఈసీ రాజీవ్కుమార్.. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించారు. మహారాష్ట్ర, జార్ఖండ్, దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సీఈసీ రాజీవ్ కుమార్.. తమపై నిందలు అర్థరహితం అంటూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈవీఎంల ట్యాంపరింగ్, ఎగ్జిట్ పోల్స్పై సీఈసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్పోల్స్కు శాస్త్రీయత లేదని.. ఎగ్జిట్పోల్స్ కేవలం అంచనాలు మాత్రమేనంటూ సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.…
Read MoreBJP vs Congress | మహారాష్ట్రలో హోరా హోరి తప్పదా | Eeroju news
మహారాష్ట్రలో హోరా హోరి తప్పదా ముంబై, అక్టోబరు 16, (న్యూస్ పల్స్) BJP vs Congress ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. 2019 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అప్పట్లో బీజేపీ, శివసేన కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. శివసేన 56 సీట్లతో రెండో స్థానంలో ఉంది. బీజేపీ-శివసేన కూటమికి వ్యతిరేకంగా కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి పోటీ చేశాయి. ఆ సమయంలో ఎన్సీపీ 54 స్థానాలతో మూడో స్థానంలో, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలతో నాలుగో స్థానంలో నిలిచాయి. అయితే బీజేపీతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఉద్దవ్ ధాకరే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్లలో మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో అనేక రాజకీయ భూకంపాలు…
Read MoreDiwali | ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ | Eeroju news
ఢిల్లీలో దీపావళి క్రాకర్స్ బ్యాన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Diwali ఏటా అక్టోబర్- నవంబర్ వస్తే చాలు. దేశమంతటా వాతావరణం ఒకలా ఉంటుంది. దేశ రాజధాని దిల్లీలో మాత్రం మరోలా ఉంటుంది. జాతీయ స్థాయిలోనే అత్యధిక స్థాయిలో పొల్యూషన్ ఉండే దిల్లీలో ఈసారి పండక్కి ముందే ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది.దసరా పండుగ అయిపోయింది. ఇప్పుడు చిన్నా పెద్దా సహా అందరి దృష్టి దీపావళిపైనే ఉంది. మరో రెండు, మూడు రోజుల్లో టపాసుల షాపులు జోరుగా అమ్మకాలు ప్రారంభించనున్నాయి. అయితే ఊహించని రీతిలో ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించింది. దీపావళికి టపాసులు ఎవరూ కాల్చొద్దని సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. అసలు టసాసుల షాపులు సైతం పెట్టొకూదంటూ ఆర్డర్స్ పాస్ చేసింది.ఫలితంగా ఈ దీపావళిని కొవ్వొత్తులతో జరుపుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. ఇదా ఎందుకు…
Read MoreElection Commission | ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ | Eeroju news
ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్) Election Commission భారతదేశంలో మరో మినీ ఎన్నికల సమరానికి వేళ అయ్యంది. దేశంలోనే జీఎస్డీపీ, జీడీపీలో నెంబర్ వన్ గా ఉన్న మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ ప్రసంగాలు, నేతల ప్రచారాలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో వేడి వాతావరణం సంతరించుకోనుంది.ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ వారం ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక వచ్చే నెలలో అంటే నవంబర్ రెండో వారం కానీ మూడో వారంలో కానీ ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలోనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉత్తర్ప్రదేశ్లోని రాయబరేలీ…
Read MoreDelhi | డిల్లీలో రద్దీ ట్యాక్స్… | Eeroju news
డిల్లీలో రద్దీ ట్యాక్స్… న్యూఢిల్లీ, అక్టోబరు 14, (న్యూస్ పల్స్) Delhi దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా దేశ రాజధాని దిల్లీలో ప్రజలు చాలా కాలంగా రద్దీ రోడ్లతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఇప్పటివరకు పెద్దగా పరిష్కారం దక్కలేదు. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం ‘ట్యాక్స్’ ఆలోచనతో ముందుకొచ్చింది. ఈ ‘దిల్లీ కంజెషన్ ట్యాక్స్’ ప్రకారం.. రద్దీ సమయంలో, ఎంపిక చేసిన రోడ్డు మీద మీరు ప్రయాణిస్తే అదనంగా- కొత్త ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది! ఇలా చేస్తే, ట్రాఫిక్ తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. రద్దీ సమయాల్లో నిర్దేశిత రహదారులను ఉపయోగించినందుకు డ్రైవర్లకు ఛార్జీలు వసూలు చేసే వ్యూహాన్ని రూపొందిస్తున్నామని రవాణా శాఖ ప్రత్యేక కమిషనర్ షహజాద్ ఆలం తెలిపారు.రవాణా నిర్వహణకు కొత్త…
Read MoreSubrahmanya Swamy case on Rahul citizenship | రాహుల్ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేసు | Eeroju news
రాహుల్ పౌరసత్వంపై సుబ్రహ్మణ్య స్వామి కేసు న్యూఢిల్లీ అక్టోబర్ 14 Subrahmanya Swamy case on Rahul citizenship కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పౌరసత్వం అంశంపై అలహాబాద్ హైకోర్టు ముందు పెండింగ్లో ఉన్న పిటిషన్ కాపీ దాఖలుకు బిజెపి నేత సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హైకోర్టు బుధవారం వ్యవధి మంజూరు చేసింది. తాను పిటిషన్ నకలు పొందానని, ఈ విషయంలో అభ్యర్థనలు తన పిటిషన్ వాదనలకు భిన్నమైనవని స్వామి హైకోర్టుకు తెలియజేశారు. తమ గత ఉత్తర్వును పాటిస్తూ ఎలక్ట్రానిక్ రీతిలో డాక్యుమెంట్లు దాఖలు చేయవలసింని పిటిషనర్ను ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్, న్యాయమూర్తి తుషార్ రావ్ గెడెలాతో కూడిన ధర్మాసనం కోరి, తదుపరి విచారణకు ఆయన పిటిషన్ను నవంబర్ 6కు పోస్ట్ చేసింది. రాహుల్ గాంధీ భారత పౌరసత్వంరద్దు చేయాలని కోరుతూ తాను సమర్పించిన లేఖపై నిర్ణయం…
Read MoreRatan Tata | టాటా గ్రూప్ వారుసులెవరు.. | Eeroju news
టాటా గ్రూప్ వారుసులెవరు.. ముంబై, అక్టోబరు 10, (న్యూస్ పల్స్) Ratan Tata | టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఇక లేరు. బ్రీచ్ క్యాండీలో చికిత్స పొందుతూ ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అతను వ్యాపార దిగ్గజం మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తనకుతానే సాటి. గత కొన్నేళ్లుగా యువతను ప్రోత్సహించేందుకు స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టారు కూడా. 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆయన్ను ద్వేషించే వారెవరూ లేరని ఓ సందర్భంలో రతన్ టాటానే స్వయంగా అన్నారు. ఏ వ్యాపారవేత్తకు ఇంత గౌరవం లభించలేదు. అయితే ప్రస్తుతం ఆయర మరణానంతరం ఆయన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడు ఎవరనేది సర్వత్రా చర్చించుకుంటున్నారు. అందుకు కారణం లేకపోలేదు. రతన్ టాటా ఆజన్మ బ్రహ్మచారి. వారసులు లేనందున టాటా గ్రూప్ సంస్థల పగ్గాలు ఎవరు…
Read More