మహానాడు ఊహించిన దానికంటే విజయవంతం అయిందని.. అందరికీ కృతజ్ఞతలు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు చిత్రపటానికి టీడీపీ నేతలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ… మినీ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం కలిగించిందని… వైసీపీ నేతల్లో గుబులు రేగుతోందని అన్నారు. కొంతమంది ఉక్రోషం తట్టుకోక మేనిఫెస్టోను వైసీపీ నేతలు చించివేశారని మండిపడ్డారు. టీడీపీకి మేనిఫెస్టో.. భగవద్గీత, ఖరాన్, బైబిల్ లాంటిందని చెప్పుకొచ్చారు. ఇది ట్రైలర్ మాత్రమే…అసలైనది తర్వాత ఉందని అన్నారు.
జనరంజక పాలనకు నాలుగేళ్లు పూర్తి..
రాష్ట్ర ప్రజలు ఏం కోరుకుంటున్నారో… మేధోమథనం జరిగిన తర్వాతే మేనిఫెస్టోనిను విడుదల చేశారని తెలిపారు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో విధ్వంసపాలన జరుగుతోందన్నారు. అమ్మఒడి ఎంత మంది ఉన్నా ఇస్తామని చెప్పి… ఇప్పుడు ఒక్కరికే ఇస్తున్నారని విమర్శించారు. గతంలో దీపం పథకం తెచ్చిన ఘనత చంద్రబాబు దే అని… ఇప్పుడు మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని అన్నారని అన్నారు. యువగళం పాదయాత్ర విజయవంతంగా జరుగుతోందన్నారు. 20 లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు… నిరుద్యోగులకు వరమన్నారు. బీసీలకు ఒక రక్షణ చట్టం.. ఇంటింటింటికి మంచి నీరు చాలా మంచి పథకాలు అని ఆయన చెప్పుకొచ్చారు.