అభివృద్ధి పైన వైసిపి పార్టీ చర్చకు రావడానికి భయం. ఎపిలో అభివృద్ధి శూన్యమని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఆదాయం పెరగడంలేదు. ప్రజల సోమ్ము , ప్రజలకు పంచి గొప్పలు చెప్పుకుంటున్నారు. 4 సంవత్సరాలలో ఎపిలో ఎంతమంది కొత్త వైద్యులు వచ్చారు. ఎన్ని హాస్పటల్స్ కట్టారు. ఢిల్లీ ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన మారాడు. అప్పు చేయకుండా ఏరోజు జగన్ ప్రభుత్వం లేదు.
ఎపిలో ఉండేది పేరుకే మంత్రులు…ఉన్నారు అంటే ఉన్నారు.. తిట్టడానికి బయటకు వస్తారు. దేశంలో ఎక్కడ పెరగని ధరలు ఎపిలో పెరుగుతుంటాయి. ఎపిలో ఎక్సైజ్ శాఖ మాత్రమే బాగానే పనిచేస్తోంది. మద్యం శాఖ మంత్రికి ప్రపంచ స్ధాయిలో అవార్డు ఇవ్వాలి. రిజిస్టేషన్ ఆపేసి మరి కొత్త జీవో తెచ్చి ఆదాయం పెంచుకోవడానికి చార్జీలు పెంచుతున్నారని అయన అన్నారు.