రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో రాజకీయాలు హీట్ ఎక్కాయి. బీఆర్ఎస్ నేత చల్యేడ లక్ష్మీ నరసింహారావు పట్టణం లో తన స్వంత పార్టీ కార్యాలయం ప్రారంభించారు. దాంతో చల్మేడ లక్ష్మి నరసింహ రావు వర్సెస్ ఎమ్మెల్యే రమేష్ బాబు గా వ్యవహారం మారింది. పార్టీ కార్యాలయం ఒపనింగ్ కి వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రభాకర్ రావు, కొనరావుపేట, సనుగుల సింగిల్ విండో చైర్మన్లు బండ నర్సయ్య యాదవ్, జలగం కిషన్ రావు, మాజీ జడ్పీ చైర్ పర్సన్ తీగల రవీందర్ గౌడ్, కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్, మాజీ సేస్ డైరెక్టర్ గజనంద రావు, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు హజరయ్యారు.
గత కొంత కాలంగా నియోజక వర్గం లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నా చల్మేడ, టికెట్ రేసులో వున్నారని పార్టీ వర్గాల సమాచారం. చల్మేడ లక్ష్మి నరసింహ రావు మాట్లాడుతూ కార్యాలయం ఓపెనింగ్ అనేది వ్యక్తిగతం. పార్టీ ఓపెనింగ్ కార్యక్రమం కి బి ఆర్ ఎస్ నాయకులు చాలా మంది అభిమానంతో హాజరయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా వేములవాడ ప్రజలకు సేవ చేస్తాను. అవకాశం ఇస్తే ఎమ్మెల్యేగా పోటీ చేస్తా. ఇప్పటికే చాలా సేవ కార్యక్రమాలు చేపట్టాను. నేను వేములవాడ నియోజక వర్గానికి చెందిన వాడినేనని అన్నారు.