బెంగళూరులో చీరల దుకాణంలో భారీ దొంగతనం రూ.91 వేల విలువైన 61 చీరలు అపహరించిన మహిళ కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఒక సంఘటన తీవ్ర దుమారం రేపింది. చీరలు దొంగిలించిందన్న ఆరోపణతో ఓ మహిళపై దుకాణం యజమాని, అతని సిబ్బంది నడిరోడ్డుపై అమానుషంగా దాడి చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నందుకు చివరికి వారే కటకటాల పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఘటన వివరాలు తేదీ: సెప్టెంబర్ 20వ తేదీన బెంగళూరులోని అవెన్యూ రోడ్డులోని ‘మాయా సిల్క్స్ శారీస్’ అనే వస్త్ర దుకాణంలోకి ఒక మహిళ ప్రవేశించింది. ఆమె దుకాణదారుల కళ్లుగప్పి సుమారు రూ.91,500 విలువ చేసే 61 చీరలు ఉన్న ఒక కట్టను దొంగిలించింది. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనిపై…
Read More