హిందూపురం పర్యటనకు వచ్చిన బాలయ్య ఆయన కాన్వాయ్ ఎదుటే అభిమానుల నిరసన ప్లకార్డులు ప్రదర్శిస్తూ కార్యకర్తల ఆందోళన హిందూపురం శాసనసభ్యులు, అగ్రశ్రేణి సినీ నటులు నందమూరి బాలకృష్ణకు రాష్ట్ర మంత్రిమండలిలో స్థానం కల్పించాలంటూ ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరసన చేపట్టారు. గత వారం బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గ పర్యటనకు విచ్చేయగా… ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ దారిలోనే అభిమానులు భారీగా గుమిగూడి ప్లకార్డులు ప్రదర్శించారు. బాలయ్యకు తక్షణమే మంత్రి పదవి ఇవ్వాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తన కాన్వాయ్ను అడ్డగించి, ప్లకార్డులతో తమ నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలు, అభిమానుల డిమాండ్లను బాలకృష్ణ శ్రద్ధగా ఆలకించారు. అయితే, దీనిపై ఆయన ఏ విధమైన హామీ ఇవ్వకుండా, అభిమానులకు చేతులు ఊపుతూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్లారు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడానికి బాలకృష్ణ…
Read More