విజయవాడలో బీఎస్ఎన్ఎల్ 4జీ సేవల ప్రారంభోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని భద్రతకు క్వాంటం కంప్యూటింగ్ ఎంతో అవసరమని వ్యాఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం విజయవాడలో జరిగిన బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జీ నెట్వర్క్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా క్వాంటం మిషన్ను ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇందులో భాగంగానే అమరావతిలో అత్యాధునిక క్వాంటం కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మరియు బీఎస్ఎన్ఎల్ అధికారులు పాల్గొన్నారు. ఈ వేదికపై నుంచి చంద్రబాబు మాట్లాడుతూ, సాంకేతిక…
Read More