వివాహిత మహిళల ఈడబ్ల్యూఎస్పై విద్యాశాఖ కొర్రీ తండ్రికి బదులుగా భర్త ఆదాయ ధ్రువీకరణ తప్పనిసరి సంపన్న కుటుంబాల మహిళలు కోటా పొందుతున్నారంటూ ఫిర్యాదులు మెగా డీఎస్సీ ఎంపిక ప్రక్రియలో సర్టిఫికెట్ల పరిశీలన వివాదాస్పదంగా మారింది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాలో ఎంపికైన వివాహిత మహిళా అభ్యర్థులకు విద్యాశాఖ కొత్త నిబంధన విధించడంతో ఆందోళన నెలకొంది. ఇప్పటివరకు తండ్రి పేరుతో సమర్పించిన ఈడబ్ల్యూఎస్ ధ్రువపత్రాలు చెల్లవని, తాజాగా భర్త పేరుతో, ఆయన ఆదాయం ఆధారంగా జారీ చేసిన సర్టిఫికెట్లను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ఈ వివాదం వెనుక కారణం ఉంది. డీఎస్సీ దరఖాస్తు సమయంలో అభ్యర్థులు వివాహితులా, కాదా అనే వివరాలను పేర్కొనాల్సి వచ్చింది. చాలామంది వివాహిత మహిళలు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ను తమ పుట్టింటి (తండ్రి) ఆదాయం ఆధారంగానే సమర్పించారు. వివాహం…
Read More