ధనత్రయోదశికి 35-40 శాతం పెరిగిన నగల అమ్మకాలు ఒక్కరోజే 7 శాతం మేర పతనమైన వెండి ధర అంతర్జాతీయ మార్కెట్లోనూ తగ్గిన పసిడి రేట్లు పండుగ కొనుగోళ్లతో రికార్డు స్థాయికి చేరిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ధనత్రయోదశి సందర్భంగా భారీగా నగల అమ్మకాలు జరిగిన మరుసటి రోజు, మంగళవారం నాడు ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ (Profit Booking)కు మొగ్గు చూపడంతో పసిడి, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. సోమవారం ఆల్-టైమ్ గరిష్ఠాలను తాకిన ఈ లోహాలు, ఈరోజు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. వెండిలో భారీ పతనం దేశీయ మార్కెట్లో వెండి ధరలో అత్యంత భారీ పతనం కనిపించింది. ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) సమాచారం ప్రకారం, కిలో వెండి ధర ఏకంగా 7 శాతం పడిపోయింది. దీంతో కిలో వెండి…
Read More