గత సర్కారు యూనిఫాం కొనుగోళ్లపై విజిలెన్స్ విచారణకు ఆదేశం చేనేత సొసైటీలకు యూనిఫాం ఆర్డర్లపై అధ్యయనానికి వర్కింగ్ గ్రూప్ గత ఐదేళ్లలో పాఠశాల విద్యార్థుల యూనిఫాంల కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అసెంబ్లీలో తెలిపారు. విచారణ నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో, చేనేత కార్మికులకు మద్దతుగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు లోకేశ్ ప్రకటించారు. పాఠశాల యూనిఫాంల తయారీ ఆర్డర్లలో కొంత శాతాన్ని చేనేత సహకార సంఘాలకు ఇచ్చే అంశంపై అధ్యయనం చేసేందుకు ఎమ్మెల్యేలతో ఒక వర్కింగ్ గ్రూప్ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చేనేత కార్మికులకు మద్దతుగా కీలక నిర్ణయం సమస్యల పరిష్కారం: గతంలో చేనేత సొసైటీలకు ఆర్డర్లు ఇచ్చినప్పుడు సరఫరాలో జాప్యం,…
Read More