RajnathSingh : సరిహద్దులు దాటేందుకూ సిద్ధం: పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ గట్టి హెచ్చరిక!

Defence Minister Rajnath Singh Warns Pakistan Against Sponsoring Terrorism

జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్ దేశానికి ముప్పు పొంచి ఉంటే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా దిగుతామని హెచ్చరిక మతం ఆధారంగా ఆపరేషన్ సిందూర్ నిర్వహించలేదని వ్యాఖ్య రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక జారీ చేస్తూ, భారత పౌరుల రక్షణ మరియు దేశ సమగ్రత కోసం ఎన్డీయే ప్రభుత్వం సరిహద్దులు దాటేందుకు కూడా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఢిల్లీలో జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JITO) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దేశానికి ముప్పు వాటిల్లితే ఎలాంటి నిర్ణయాత్మక చర్యలకైనా వెనుకాడబోమని ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా రుజువు చేశామని ఆయన అన్నారు. 2016 నాటి సర్జికల్ స్ట్రైక్ మరియు 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులను కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు…

Read More

IndiaInSpace : భారత ఉపగ్రహానికి పెను ప్రమాదం: స్పేస్ సెక్యూరిటీపై భారత్ దృష్టి

India’s New Space Defense Strategy: 'Bodyguard Satellites'

భారత ఉపగ్రహానికి కిలోమీటరు దూరంలోకి వచ్చిన పొరుగు దేశ శాటిలైట్ అంతరిక్షంలోని ఆస్తుల రక్షణకు ‘బాడీగార్డ్ శాటిలైట్ల’ తయారీకి కేంద్రం ప్రణాళిక ముప్పును ముందుగానే గుర్తించి, ఎదుర్కోవడమే ఈ వ్యవస్థ లక్ష్యం అంతరిక్షంలో భారత ఉపగ్రహానికి పెను ప్రమాదం త్రుటిలో తప్పింది. పొరుగు దేశానికి చెందిన ఒక శాటిలైట్ మన ఉపగ్రహానికి అత్యంత సమీపంగా దూసుకొచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం, అంతరిక్షంలోని మన ఆస్తుల రక్షణ కోసం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా, ముప్పును ముందుగానే పసిగట్టి ఎదుర్కొనేందుకు ‘బాడీగార్డ్ శాటిలైట్లను’ అభివృద్ధి చేయాలని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 2024 మధ్యలో భూమికి 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఇస్రోకు చెందిన ఒక ఉపగ్రహానికి పొరుగు దేశ శాటిలైట్ అత్యంత సమీపంగా వచ్చింది.…

Read More