నాలుగే నిమిషాల ఆన్లైన్ మీటింగ్లో ఉద్యోగుల తొలగింపు అమెరికా కంపెనీలో పనిచేస్తున్న భారత టెకీకి చేదు అనుభవం కెమెరా, మైక్ ఆపేసి ప్రకటన చేసిన కంపెనీ సీఓఓ టెక్ ప్రపంచంలో లేఆఫ్లు సర్వసాధారణంగా మారాయి. అయితే, కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగించే తీరు తీవ్ర మానసిక క్షోభకు గురిచేస్తోంది. తాజాగా, అమెరికాకు చెందిన ఒక కంపెనీ తన భారతీయ ఉద్యోగులను కేవలం నాలుగు నిమిషాల ఆన్లైన్ మీటింగ్తో తొలగించడం సంచలనం రేకెత్తించింది. ఈ దారుణ అనుభవాన్ని ఎదుర్కొన్న ఒక ఉద్యోగి రెడిట్ (Reddit) ప్లాట్ఫామ్లో పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. షాకింగ్ తొలగింపు కథనం: బాధిత ఉద్యోగి కథనం ప్రకారం.. ఉదయం 11 గంటలకు కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO)తో తప్పనిసరిగా హాజరు కావాల్సిన మీటింగ్కి క్యాలెండర్ ఇన్వైట్ వచ్చింది. మీటింగ్ ప్రారంభం కాగానే,…
Read More