రూ. 1,10,700 పలుకుతున్న 22 క్యారెట్ల పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో 4,000 డాలర్లకు చేరువైన బంగారం పెరుగుదలకు అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్ సహా పలు కారణాలు బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,23,420కి చేరింది. 22 క్యారెట్ల పసిడి ధర రూ. 1,10,700గా ఉంది. వెండి ధర కూడా రోజురోజుకూ పెరుగుదల బాటలో పయనిస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 1.54 లక్షలకు చేరింది. బంగారం ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేస్తున్నారు. పసిడి ఆభరణాల విక్రయాలు ఈ మధ్యకాలంలో తగ్గాయని వ్యాపారులు చెబుతున్నారు. బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అమెరికా ఫెడరల్ గవర్నమెంట్ షట్డౌన్, డొనాల్డ్ ట్రంప్ అధిక టారిఫ్ విధింపు, అంతర్జాతీయ…
Read More