ఉటాలో బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ మెడపై కాల్పులు భారతీయులకు వీసాలు ఆపేయాలని కిర్క్ డిమాండ్ నిందితుడి కోసం కొనసాగుతున్న ఎఫ్బీఐ గాలింపు చర్యలు అమెరికాలో సంచలనం సృష్టించిన రాజకీయ నేత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు అయిన చార్లీ కిర్క్ (31) దారుణ హత్యకు గురయ్యారు. భారతీయులకు వీసాలు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే, బుధవారం ఉటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో చార్లీ కిర్క్ ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఓ దుండగుడు ఆయన మెడపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్న వయసులోనే కన్జర్వేటివ్…
Read MoreTag: #visa
uk : భారతీయులకు బ్రిటన్లో వీసా కష్టాలు: వెనక్కి పంపే నిబంధనలపై బ్రిటన్ కఠిన వైఖరి
బ్రిటన్లో భారతీయులకు బ్రేక్ వీసాలపై ఉక్కుపాదం మోపనున్న కొత్త ప్రభుత్వం! ‘వెనక్కి పిలవండి.. లేదంటే వీసాలు బంద్’ అంటూ హెచ్చరిక బ్రిటన్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసినా తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకునే విషయంలో సహకరించని దేశాలపై ఉక్కుపాదం మోపాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్, నైజీరియాలు ఉండటంతో, ఆయా దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ కాబోయే హోం సెక్రటరీ (లేబర్ పార్టీ షాడో హోం సెక్రటరీ) యెవెట్ కూపర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అక్రమ వలసదారులను నియంత్రించడంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం ‘రిటర్న్స్’ ఒప్పందాలను (తిరిగి పంపించే ఒప్పందాలు) కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం వీసా గడువు…
Read More